BRO : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం బ్రో. అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. బ్రో సినిమా థియేటర్లలో సందడి చేయలేకపోయింది. అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ నాలుగు సినిమాలు ఒప్పుకుని దూకుడు పెంచాడు. ఇందులో భాగంగానే బ్రో సినిమా హిట్ అవుతుందని భావించినా కుదరలేదు.
ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రూపొందించింది. కేతిక శర్మ, ప్రియ వారియర్ హీరోయిన్లుగా నటించారు. థమన్ స్వరాలు సమకూర్చారు. వినోదయ సీతం చిత్రానికి రీమేక్ గా వచ్చింది. సోషియో ఫాంటసీగా రూపొందిన సినిమా ప్రతికూల పరిస్థితుల కారణంగా డిజాస్టర్ గా నిలిచింది. రెండు వారాల్లోనే తన పరుగును నిలిపేసింది.
బ్రో సినిమాకు దాదాపు రూ. 97 కోట్లు ఖర్చయ్యాయి. కానీ వచ్చింది మాత్రం రూ.67 కోట్లు వచ్చాయి. ఇంకా రూ. 30 కోట్లు నష్టాన్ని మూటగట్టుకుంది. దీని డిజిటల్ స్ర్టీమింగ్ హక్కులకు మాత్రం పోటీ ఏర్పడింది. ఓటీటీ, నెట్ ఫ్లెక్స్ సంస్థ డిజిటల్ హక్కులు సొంతం చేసుకోవడం గమనార్హం. ఆగస్టు 25 నుంచే ఓటీటీలోకి రాబోతోందని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ సినిమా నెలరోజుల్లోపే ఓటీటీల్లోకి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పవన్ కెరీర్ లోనే త్వరగా స్ట్ర్రీమింగ్ వచ్చిన సినిమాగా బ్రో నిలవడం ప్రేక్షకులకు ఆందోళన కలిగిస్తోంది. సినిమాలో సెన్సార్ కట్ చేసిన సంభాషణలు కూడా కలిపి విడుదల చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తానికి పవన్ కల్యాణ్ బ్రో సినిమా ఫెయిల్యూర్ లో సంచలనం కలిగించింది.