Nandamuri Taraka Rama Rao : తెలుగు తేజం, అన్న నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా.. ఏం చెప్పినా.. తక్కువే అవుతుంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన మహానుభావుడిగా, గొప్ప వ్యక్తిగా, శక పురుషుడిగా ఎదిగారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆయన సాధించిన విజయాలు, రికార్డులు చెప్తే టైమ్ సరిపోదనే చెప్పాలి. అన్నింట్లో కూడా అన్నగారు గొప్పవారే.
తన తల్లిదండ్రుల వద్ద క్రమశిక్షణగా ఉండే ఎన్టీఆర్ తన కుటుంబాన్ని కూడా అంతే క్రమశిక్షణగా పెంచారు. ఒక్కొక్కరిని ఒక్కో రంగంలో మెరికలుగా తీర్చి దిద్దారు. నలుగురు కొడుకులు వారి భార్యలు కూతుళ్లు, అల్లుళ్లు, మనుమండ్లు, మనుమరాండ్లు ఇలా పెద్ద కుటుంబమే అన్నగారిది. ఇక వారంతా ఒక చోట చేరితో ఆ సందడి మాటల్లో చెప్పలేం.
ఇటీవల ఎన్టీఆర్ ఆయన కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ ప్రభుత్వం సంవత్సరం పాటు కొనసాగింది. ఆ సమయంలో రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ (1982-1987) ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 28వ తేదీన శక పురుషుడు నందమూరి తారక రామారావు బొమ్మతో కూడిన రూ. 100 నాణేన్ని రిలీజ్ చేసింది. దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎన్టీఆర్ కుటుంబానికి కేంద్రం ఆహ్వానాలు పంపింంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ కొడుకుల నుంచి మనుమల వరకు అందరూ ఇందులో పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఫొటో దిగారు. కాగా అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్, ఇప్పటి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.