Drink alcohol :ఇటీవల కాలంలో షుగర్ వేగంగా విస్తరిస్తోంది. మన ఆహార అలవాట్ల ప్రభావంతోనే మధుమేహం చాలా మందిని బాధిస్తోంది. ఈ మేరకు డయాబెటిక్ రాజధానిగా తెలంగాణ మారుతోంది. జీవన శైలి ప్రభావంతో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రెట్టింపవుతోంది. భవిష్యత్ లో ఇంకా డయాబెటిక్ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మధుమేహం ఎందుకు వస్తోంది. ఇది రావడానికి కారణాలేంటి? దీని వల్ల నష్టాలేంటో తెలుసుకుని నియంత్రణలో ఉంచుకోవడం మంచిది.
మధుమేహం ఉన్న వారు మందు తాగొచ్చా? తాగితే ఏమవుతుంది? ఏ అవయవాలు దెబ్బతింటాయి? అనే విషయాలు తెలుసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్లు మందు తాగొద్దని వైద్యలులు చెబుతున్నారు. ఒకవేళ తాగితే ఒక పెగ్ మాత్రమే తాగాలి. అంతకుమించి తాగితే ఇబ్బందులు వస్తాయి. షుగర్ ఉన్న వారు మద్యానికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
కొందరు మాత్రం షుగర్ ఉన్నా మద్యం తాగుతారు. ధూమపానం చేస్తారు. దీంతో శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శరీర అవయవాలు దెబ్బ తింటాయి. లివర్, కిడ్నీ, గుండె పనితీరు దెబ్బతింటుంది. దీంతో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. కానీ ఎవరు వినడం లేదు. అలవాట్లు మార్చుకోవడం లేదు. ఈ క్రమంలో వారి ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం.
మధుమేహం ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి. ఆహార అలవాట్లు మార్చుకోవాలి. జీవనశైలి సరైన పద్ధతిలో అలవాటు చేసుకోవాలి. ఆహారంలో నియంత్రణ ఉండాలి. స్వీట్లు తీసుకోకూడదు. మామిడి, సీతాఫలం, సపోట లాంటి పండ్లు తినకూడదు. ఇలా కచ్చితమైన నిబంధనలు పాటిస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఫలితంగా ఎలాంటి ముప్పు వాటిల్లదు. లేకపోతే ఆరోగ్యం దెబ్బతిని ఒళ్లు గుళ్ల అవుతుంది.