CPI Ramakrishna : నూతన ఆర్థిక సంవత్సరానికి అప్పులతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వాగతం పలికిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శికే రామకృష్ణ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ను తన దాదాపు 10 లక్షల కోట్ల అప్పుల్లో జగన్ ముంచాడని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
మార్చి 31 నే 1000 కోట్ల అప్పు తెచ్చిన జగన్ సర్కార్ ఏప్రిల్ 2 న మరో నాలుగు వేల కోట్లు అప్పు తెచ్చిందని ఆయన ఆరోపించారు. కాగ్ హెచ్చరికలను జగన్ ప్రభుత్వం లెక్కచేయడం లేదన్నారు.
అప్పులు తెచ్చు అస్మధీయులకు చెల్లిస్తోందని ఆయన మండిపడ్డారు. ఉద్యోగులకు చర్చించాల్సిన 32 వేల కోట్ల బకాయిల సంగతి అతిగతి లేదన్నారు.