Delhi Capitals : ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తో శుక్రవారం లక్నో లో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ ఆల్ రౌండ్ ప్రదర్శ నతో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం లక్నో జట్టు సొంత మైదానంలో జరిగిన మ్యాచ్ లో హోం గ్రౌండ్ ఆటగాళ్లు బ్యాట్ తో తడబడ్డారు. స్టార్ ఆటగాళ్లతో దుర్భేధ్యంగా ఉన్నా లక్నో బ్యాటింగ్ లైనఫ్ ను కుల్దీప్ యాదవ్ కకావికలం చేశాడు.
వరుస బంతుల్లో పూరన్, రాహుల్ లను ఔట్ చేసిన కుల్ దీప్ యాదవ్ మొత్తం మూడు వికెట్లతో లక్నో వెన్ను విరిచాడు. దీంతో 95 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిపోయింది. ఈ సమయంలో లక్నో యువ సంచలనం ఆయుష్ బదోని, 35 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఆయుష్ బదోనికి అర్షద్ ఖాన్ (20) సహకారం అందించడంతో 73 పరుగుల భాగస్వామ్యంతో 20 ఓవర్లకు 167/7 స్కోరు చేయగలిగింది.
అనంతరం రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్ వికెట్ ను ఎర్లీగా నే కోల్పోయింది. 8 పరుగులకే వార్నర్ వెనుదిరగ్గా.. ఓపెనర్ పృథ్వీ షా, వన్ డౌన్ లో వచ్చిన ఐపీఎల్ డెబ్యూ బ్యాటర్ జేమ్స్ ఫ్రసెర్ ముగుర్క్ అయిదు సిక్సులు, రెండు ఫోర్లతో 55 పరుగులతో చెలరేగగా, పంత్ (41) పరుగులతో సహకరమందించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు సునాయాసమైంది. చివర్లో పంత్, జేమ్స్ ఫ్రసెర్ అవుటైనా.. ట్రిస్టన్ స్ట్రబ్స్, షై హోప్ ఢిల్లీ విజయాన్ని పరిపూర్ణం చేశారు.
దీంతో వరుస ఓటములతో సతమతవవుతూ పాయింట్స్ టేబుల్స్ లో చివరలో ఉన్నా ఢిల్లీకి ఈ విజయం ఊరటనిచ్చింది. బ్యాటింగ్ లో పంత్ ఫామ్ లోకి రావడం, కొత్త బ్యాటర్ లయ అందుకోవడం, బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం ఢిల్లీకి సానుకూల అంశాలు. రాబోయే మ్యాచ్ ల్లో పాజిటివ్ ఎనర్జీతో పోరాడేందుకు ఈ గెలుపుకు వారికెంతో ఉపయోగపడుతుంది. ఈ విజయంతో ఒక స్థానం ఎగబాకిన ఢిల్లీ పాయింట్స్ టేబుల్ లో తొమ్మిదో స్థానానికి చేరుకుంది.