pawan mahesh ntr : తెలుగు సినిమా పరిశ్రమలో ముగ్గురు హీరోలు నెంబర్ వన్ పొజిషన్ కోసం చూస్తున్నారు. వారిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లు ఉన్నారు. వీరి కెరియర్ లో సూపర్ హిట్ చిత్రాలు ఎన్నో ఉన్నా వారికి స్టార్ ఇమేజ్ ను తీసుకొచ్చిన చిత్రాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. తెలుగు సినిమా గతిని మార్చే విధంగా తమ చిత్రాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టార్ ఇమేజ్ ను పెంచిన సినిమాల్లో ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ సినీ రికార్డులు కొల్లగొట్టింది. పవన్ కెరీర్ లోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హరీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. పవన్ కల్యాణ్ కు పోయిన స్టార్ డమ్ ను తీసుకొచ్చింది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు మంచి హిట్ తీసుకొచ్చిన సినిమా ఒక్కడు. ఈ సినిమాతో మహేష్ బాబులో మరో యాంగిల్ చూశారు. అంత వరకు ప్రేమకథా చిత్రాలు చేసిన మహేష్ ఒక్కసారిగా ప్రిన్స్ అయిపోయాడు. అటు క్లాస్ ఇటు మాస్ ను ఆకట్టుకుని తనకు ఎదురే లేదని నిరూపించుకున్నాడు. ఏకంగా సూపర్ స్టార్ అయిపోయాడు. ఈ మూడు సినిమాల్లో కూడా హీరోయిన్ గా చేసింది భూమికే. దీంతో ఆమె వల్లే వీరికి ఇంతటి ఖ్యాతి లభించిందని ఇండస్ట్రీలో టాక్.
జూనియర్ ఎన్టీఆర్ జీవితాన్ని మలుపు తిప్పింది సింహాద్రి. 2003లో విడుదలైన ఈ సినిమాతో ఎన్టీఆర్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా స్టార్ డమ్ తీసుకొచ్చింది. యంగ్ టైగర్ అనే బిరుదును ఆపాదించింది. టాప్ వన్ పొజిషన్ కు పోటీపడేలా చేసింది ఈ సినిమానే. దీంతో ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పరిశ్రమను షేక్ చేసింది.
ఇలా ఈ ముగ్గురు హీరోలు సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ గా ఎదగాలని చూస్తున్నారు. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. టాప్ హీరోగా అనిపించుకోవాలని కలలు కంటున్నారు. ఇప్పటికే ఆ దారిలో కర్చీఫ్ లు వేసుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఎవరు నెంబర్ వన్ అనే ఆలోచనలో ప్రేక్షకులు పడిపోయారు.