మన జ్యోతిష్యం ప్రకారం ద్వాదశ రాశులుంటాయి. ప్రతి రాశిలో శని సంచరిస్తుంటాడు. ఒక్కో రాశిలో ఏడున్నర సంవత్సరాలు ఉంటాడు. దీంతో ఆ సమయంలో సదరు రాశికి ఇబ్బందులు తప్పవు. ఈ కాలంలో ఎన్నో రకాల ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో శనిదేవుడు కొన్ని సందర్భాల్లో మంచి కూడా చేస్తుంటారు. కానీ శని దేవుడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలు ఇస్తుంటాడు. శని చూపు మన మీద ఉంటే మనకు మంచి జరుగుతుంది.
ఒక్కో రాశిలో ఏడున్నర ఏళ్లు ఏలిన నాటి శని ప్రభావం ఇస్తుంటాడు. ప్రస్తుతం మీన రాశికి ఏలిన నాటి శని ప్రారంభం అయింది. దీంతో మీన రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. శని ప్రభావం సరిగా లేనందున వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెబుతారు. అందుకే ఈ రాశి వారు ఏలిన నాటి శని పోయే వరకు సాహసాలు చేయడం మానుకోవాలి. శని దేవుడి అనుగ్రహం మన మీద పడే వరకు ఆగాల్సిందే.
ప్రయాగ్ రాజ్ జిల్లాలోని తర్బిహ్ గ్రామంలోని పూల్పూర్ లో శని దేవుడికి ప్రత్యేక ఆలయం ఉంది. శని జయంతి రోజు ఇక్కడ పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా సదసతి తొలగిపోతుందని పండితులు చెబుతుంటారు. శని సదసతి అంటే ఏడున్నర ఏళ్ల కాలం ఉండే శని అని అర్థం. శని దర్శనం వల్ల మనకు కలిగే శని నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం.
శని దేవుడు వక్ర చూపు వల్ల మనకు నష్టాలు కలుగుతాయి. వాటి నుంచి రక్షించుకునేందుకు శనీశ్వరుడికి పూజలు చేస్తే లాభం కలుగుతుంది. దీనికి భక్తులు శని దేవుడి ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం వల్ల శని ప్రభావం మన మీద బాగా పడుతుందని తెలుసుకోవాలి. శనీశ్వరుడి దయ వల్ల మనం జీవితంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని విశ్వాసం.