CM Revanth : బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అవసరాలను మర్చిపోయిం దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ దిక్కుమాలిన విధా నాలతో ప్రజలకు శిక్ష పడిందని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సమయంలో నగరా నికి పబ్బులు, డ్రగ్స్, గంజాయి వచ్చాయని ఆయన మండిపడ్డారు.
ఎలివేటెడ్ కారిడార్ రాకతో రాష్ట్రంలో పెట్టుబ డులు మరింత పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కి, ప్రతిష్ట పెరిగేందుకు ఒక మెట్టు దిగడంలో ఎలాంటి అభ్యంతరం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతు న్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపో యిందని ఆయన అన్నారు. గతంలో వచ్చిన డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.