స్కాంలో ఇరుక్కొని విచారణ ఎదుర్కొంటున్న కవిత తనపై కాకుండా తన భర్తపై భూములు కొనుగోలు చేసినట్లు ఈడీ భావిస్తోంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు ఫీనిక్స్ సంస్థ తరుఫున చాలా డబ్బు రియల్ ఎస్టేట్ లో పెట్టారు. అంత డబ్బు అనిల్ కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చిందని కూపీలాగే పనిలో పడింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే లిక్కర్ స్కాంతో నేరుగా సంబంధం లేకపోయినా భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్న వారి ఆస్తులను కూడా ఆరా తీయాలను ఈడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక లావాదేవీల విషయంలో క్రియేటివ్ డెవలపర్స్ యజమాని శ్రీహరిపై కూడా ఈడీ దృష్టి పెట్టింది. గత సంవత్సరం ఏప్రిల్, మేలో పిళ్లయ్ ఖాతా నుంచి శ్రీహరికి మూడు విడుతల్లో దాదాపు రూ. 5కోట్లకు పైగా మళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా ఈడీ దర్యాప్తు చేయనుంది. అయితే అరుణ్ పిళ్లయ్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీహరి, పిళ్లయ్ ని వేర్వేరుగా విచారణ చేయగా వారు ఇవే వ్యాఖ్యలు చేశారు.
పిళ్లయ్, కవిత, ఆమె భర్త అనిల్, సునీల్ ఇలా కవిత వ్యాపార లావీదేవీల్లో స్వయంగా, భాగస్వామ్యంగా ఉన్న అందరిపై ఈడీ దృష్టి సారించింది. దీంతో కవిత కుటుంబంలో అలజడి మొదలైంది. కవిత లిక్కర్ స్కాం డబ్బులను మరో చోట ఇన్వెస్ట్ చేసిందని పక్కా ఆధారాలు ఉన్నాయని ఈడీ చెప్తున్నా వాటిని బయట పెట్టడం లేదు.