డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీ హ్యాపీడేస్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ తమన్నాకు ఇద్దరు స్నేహితులు అందులో ఒకరు స్రవంతి, మరొకరు అపర్ణ-అప్పు (గాయత్రీరావు) సినిమాలో ఆమెకు మంచి రోల్ ఇచ్చారు శేఖర్ కమ్ముల. మగాడిలా జుట్టు కట్ చేసుకొని డ్రెస్ లు వేసుకొని నిఖిల్ తో లవ్ లో పడి చివరికి ప్రపోజ్ చేసి బాధపడుతుంది.
అయితే ఈ చిత్రంలో అప్పుగా నటించిన గాయత్రీరావు గురించి చాలా మందికి తెలియదు. ఇటీవల ఆమె గురించి తెలుసుకోవాలని నెటిజన్లు ఉత్సాహం చూపుతున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
హ్యాపీడేస్ లో ఆమె నటనతో బాగా అలరించింది. సహజంగా నటిస్తూ, స్ర్కీన్ ప్రజెన్స్ ను కూడా మెప్పించి ప్రశంసలు అందుకుంది. ఆమె తీసింది తక్కువ సినిమాలే అయినా మొదటి సినిమా హ్యాపీడేస్ అంత క్రేజ్ మాత్రం దక్కించుకోలేదు. అయితే తర్వాత వచ్చిన సినిమాలు ఆమెకు అంతగా కలిసి రాలేదు.
తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన గబ్బర్ సింగ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించింది. ఆమె స్ర్కీన్ పై కనిపించింది కొంచెం సేపే అయినా తన నటన కౌశలం బయటపెట్టింది. ఇక ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయింది. అయితే ఆమె ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయి ఇప్పటికి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది.
అయితే ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు బాగా సెర్చ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ఫొటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. న్యూ లుక్ లో ఉన్న ఆమె ఎవరు అంటూ ఆరా తీయగా ఆమే అపర్ణ-APPu (గాయత్రీరావు) ఆమెను చూసిన అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈమె తల్లి పద్మ కూడా సినీ పరిశ్రమలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ విషయం మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. గాయత్రీరావు తన నటనను తన తల్లి నుంచి నేర్చుకుందని అనిపిస్తుంది. 2019లో వివాహం చేసుకున్న గాయత్రీ రావు ప్రస్తుతం చెన్నైలో స్థిరపడినట్లు తెలుస్తోంది. ఆమె సినిమాలకు శాశ్వతంగా వీడ్కోలు పలికినా ‘హ్యాపీడేస్’ను ఇప్పటికీ గుర్తుకు చేసుకునే వారు లేకపోలేదు.