Hebah Patel :
టాలీవుడ్ అందాల బ్యూటీలలో హెబ్బా పటేల్ ఒకరు.. ఈ భామ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. చేసిన సినిమాలు కొన్నే అయినా ఈమె బాగా పాపులర్ అయ్యింది. యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. రాజ్ తరుణ్ ఈ భామ కలిసి నటించిన కుమారి 21ఎఫ్ ఎంత హిట్ అయ్యిందో ప్రతీ ఒక్కరికి తెలుసు..
ఈమె ఈ సినిమాతో బాగా పాపులర్ అయ్యి భారీ క్రేజ్ కూడా సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత ఈ భామ ఎంచుకున్న సినిమాల వల్ల అవకాశాలు కోల్పోయి రేసులో వెనుకబడి పోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో హాట్ షో చేస్తు కుర్రాళ్లను రెచ్చగొడుతుంది.. ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది..
ఈ భామ వెండితెరపై అవకాశాలు అందుకోక పోయిన ఓటిటి ప్లాట్ ఫామ్ మీద అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.. ఈమె తాజాగా నటించిన ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే హర్రర్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. ఈ సినిమాను విప్లవ్ కోనేటి డైరెక్ట్ చేయగా ప్రముఖ తెలుగు ఓటిటి ఆహాలో అక్టోబర్ 6 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఈమె ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.. అయితే సదరు యాంకర్ ప్రవర్తించిన తీరుకు అమ్మడు సీరియస్ అయ్యింది. యాంకర్ ఇంటర్వ్యూ మొదలు పెట్టడమే మూడ్ బాగుందా? అంతా ఓకేనా? అంటూ సెటైరికల్ గా ప్రశించాడు.. అంతేకాదు ఇతడు ఒక్కసారి అడిగి ఊరుకోకుండా పదేపదే మూడ్ బాగుందా అంటూ అడగడంతో హెబ్బా హర్ట్ అయ్యి ఇంటర్వ్యూ నుండి వెళ్ళిపోయింది. ఈ క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.