Heroine Chances Anasuya : యంకర్ గా గుర్తింపు సంపాదించి ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్న నటి అనసూయ భరద్వాజ్. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘అత్తారింటికి దారేది’. ఈ మూవీలో ఒక పాటలో నటించే అవకాశం వస్తే అనసూయ వదులుకుందట. అయితే రీసెంట్ గా దానికి గల కారణాలను చెప్పింది.
‘అత్తారింటికి దారేదిలో సాంగ్ చేయాలని దర్శకుడు, నిర్మాత నన్ను సంప్రదించారు. అయితే అప్పటికే ఆ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. సో.. నేను నటించనని చెప్పిన. అందరిలో ఒకదానిలా నటించడం అంతే నాకు నచ్చదు. నేను నటిస్తున్నానంటే ప్రత్యేకత ఉండాలి. అందుకే ఆ పాటను నో.. అని చెప్పాను. అప్పుడు ఆ అవకాశాన్ని తిరస్కరించినందుకు అందరూ విమర్శించారు.
నో చెప్పడం తప్పుకాదు.. చెప్పిన విధానం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. నేను ఫస్ట్ నుంచి ముక్కు సూటి మనిషిని. అందుకే నేను చెప్పింది కఠినంగా అనిపించింది. ఆ సాంగ్ చేయనందుకు ఆ సమయంలో ట్విటర్ లో పెద్ద వారే జరిగింది. దీంతో అప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ కు సారీ కూడా చెప్పాను’ అని చెప్పింది అనసూయ భరద్వాజ్.
‘చాలా వరకు షూటింగ్ లో నా పోర్షన్ కంప్లీట్ చేసుకొని వెళ్లిపోతాను. షూటింగ్ తర్వాత జరిగే పార్టీలకు చాలా వరకు దూరంగా ఉంటా. ఈ కారణంతోనే హీరోయిన్ అయ్యే అవకాశాలు కోల్పోయాను అనిపిస్తుంది. ఒకప్పుడు అవకాశం వస్తే ఫస్ట్ నాకే ప్రాధాన్యం ఉండాలని అనుకున్నా.. కానీ ఇప్పుడు చాలా వరకు మారిపోయా.. ఎలాంటి పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేస్తానని నమ్మకం కలిగింది’ అని చెప్పింది.
సోషల్ మీడియా గురించి అనసూయ మాట్లాడుతూ.. ‘ప్రతి మహిళా స్వేచ్ఛ కోరుకుంటుంది. నా హస్బెండ్ నాకు అంతే స్వేచ్ఛ ఇచ్చారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే వాళ్ల ఇళ్లలో మహిళల గురించి ఆలోచిస్తేనే జాలి వేస్తుంది. విమర్శించేటోళ్లు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు.. ఇందులో నా పోస్ట్లు చూసి స్ఫూర్తి పొందేటోళ్లు కూడా చాలా మంది ఉంటారు’ అని అనసూయ భరద్వాజ్ అన్నారు.