Tension at Vijayawada :
చంద్రబాబు అరెస్టు రాష్ర్టంలో ప్రకంపనలు కలిగిస్తోంది. నిన్న చంద్రబాబును సీఐడీ పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతల నిరసనల మధ్య బాబును కోర్టులో హాజరు పరిచారు.
కోర్టు పరిసరాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరిచారు. క్రిష్ణ, గుంటూరు జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చారు. లోకేష్ రాజోలు నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. కోర్టులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.
చంద్రబాబు అరెస్టుపై కార్యకర్తలు గుండెపోటుతో మరణించారు. టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. పార్టీ నేతలు బాబు అరెస్టును ఖండిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ వర్గాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. అధికార పార్టీ ఆగడాలపై తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. నేతల తీరుపై మండిపడుతున్నారు.
టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ అధికార పార్టీ చేస్తున్న దురాగాతాలను ఎండగడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని చెబుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఒక ప్రతిపక్ష పార్టీ నేతను అరెస్టు చేయడం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీని అధికారానికి దూరం చేయడం ఖాయమని చెబుతున్నారు.