Election Commission : లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ డిజిపి తో పాటు గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల హోం సెక్రటరీలను తొలగించాలని అయా ప్రభుత్వాలను ఆదేశించింది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ముందు సర్వసాధారణంగా అధికారుల మార్పు జరుగుతుంది. అయితే రాష్ట్ర డిజిపి స్థాయి అధికారులను కూడా ఎన్నికల కమిషన్ మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సజావుగా జరగాలంటే గత ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న అధికారులు ఎవరూ ఉండకూడదని ఎలక్షన్ కమిషన్ బదిలీలు చేస్తూ ఉంటుంది.