Maheshbabu : ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో అల్లు అర్జున్ ఉత్తమ కథానాయకుడి (హీరో)గా ఎంపికయ్యారు. తెలుగు ఇండస్ట్రీని నుంచి ఈ ఘనత సాధించడం ఇదే మొదటి సారి. ఇది నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీ సగర్వంగా తలెత్తుకునేదనే చెప్పాలి. ఇక బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. 69 సంవత్సరాలుగా రాని గౌరవం ఇప్పుడు రావడంతో ప్రతీ అభిమాని ఆనందంలో ఊగిపోతున్నారు. కానీ మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం పైకి టాలీవుడ్ కు గౌరవం దగ్గిందని ఆనందంగా ఉన్న లోలోపల మాత్రం కొంత ఆవేదన చెడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. అసలు పుష్ప సినిమా మహేశ్ బాబు చేయాల్సింది కావడమే.
రంగస్థలం తర్వాత సుకుమార్ ప్రిన్స్ మహేశ్ బాబుతో సినిమా కమిట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ సంవత్సరం పాటు వివిధ కథలపై చర్చలు జరిపారు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో కథ అనుకొని ఆ తర్వాత స్లగ్మింగ్ వైపు దృష్టి మళ్లించారు. కొన్ని నెలల పాటు చర్చల తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి మహేశ్ బాబు తప్పుకున్నాడు. డేట్స్ లేకపోవడం, క్రియేటివ్ డిఫరెన్సెస్ మూలంగానే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు మహేశ్ బాబే వెల్లడించారు.
ఇక ఆ తర్వాత సుకుమార్ బన్నీతో చర్చలు జరిపి కథను కొలిక్కి తెచ్చాడు. ఇందులో భాగంగా వచ్చిందే ‘పుష్ప’. దీని షూటింగ్, రిలీజ్, పాన్ ఇండియా, పాన్ వరల్డ్, రికార్డులు, జాతీయ అవార్డుల వరకు మనకు తెలిసిందే. ఈ మూవీతో అల్లు అర్జున్ మార్కెట్ కూడా భారీగా పెరిగింది. మహేశ్ సినిమాను అల్లు అర్జున్ దక్కించుకొని సక్సెస్ కొట్టాడని మహేశ్ ఫ్యాన్స్ అప్పట్లో సూపర్ స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వచ్చిన జాతీయ స్థాయి అవార్డు మహేష్ బాబుకు దక్కాల్సింది కదా అని ఫీలవుతున్నారు.
అసలు వాస్తవం ఏంటంటే.. మహేష్ బాబుతో చర్చలు జరిపినపుడు కథా స్వరూపం కానీ.. పాత్ర కానీ ఇప్పుడున్న పుష్పలోనివి కావు. అసలు స్టోరీ లైనే అది కాదు. ఇందులో ఫర్హాద్ ఫజిల్ పాత్రను మహేశ్ బాబుతో వేయించాలనే ఆలోచన చేశాడు సుకుమార్. ఒకవేళ హీరోగా స్మగ్లర్ పాత్ర చేసినా.. బన్నీ చేసినట్లు రగ్డ్ క్యారెక్టర్, డీగ్లామరస్గా ఉండేది కాదు. మహేశ్ లుక్స్, ఇమేజ్ కు ఈ పాత్ర అస్సలు సెట్ అవ్వదు. దీంతో జాతీయ అవార్డుకు ఎంపికవడం కూడా అనుమానమే. కాబట్టి మహేశ్ బాబు జాతీయ అవార్డు మిస్సయ్యాడని ఫీలవ్వాల్సిన పని లేదు.