Drug Case : 2018 సంవత్సరంలో టాలీవుడ్ సెలబ్రిటీలే లక్ష్యంగా డ్రగ్స్ కేసు నమోదైంది. ఇందులో స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ పై అభియోగాలు మోపబడ్డాయి. వారి వెంట్రుకలు, గోళ్లు కూడా ల్యాబ్ కు పంపించారు. ఇందులో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వారికి ఊరట లభించింది. కేసు కొట్టివేస్తున్నట్లు ప్రకటించడంతో వారికి కేసుతో సంబంధం లేకుండా పోయింది.
తెలుగు పరిశ్రమకు చెందిన చాలా మంది సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ప్రముఖులే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. ఎన్నో సార్లు పట్టుబడినా వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదు. అప్పటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా విచారణలే తప్ప ఒరిగిందేమీ లేదు. దీంతో వారికి ఎలాంటి అడ్డు ఉండటం లేదు.
ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్టు ప్రకారం ఆరు కేసుల్లో సరైన సాక్ష్యాలు లభించలేదని న్యాయస్థానం తెలిపింది. వారి శరీరాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ ల్యాడ్ ధ్రువీకరించింది. ఎనిమిది కేసుల్లో ఆరింటిని న్యాయస్థానం కొట్టివేయడం గమనార్హం. ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. సెలబ్రిటీలు ఉన్న కేసులన్ని నిలబడటం లేదు. ఈనేపథ్యంలో డ్రగ్స్ కేసులు నిలబడలేదని చెబుతున్నారు.
డ్రగ్స్ కేసులో జాంబియా యువతికి ఎల్బీనగర్ కోర్టు 14 ఏళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించింది. 2021లో జాంబియా నుంచి హెరాయిన్ డ్రగ్స్ తీసుకొచ్చి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దొరికింది. రూ.50 కోట్ల విలువ చేసే 8 కిలోల హెరాయిన్ పట్టుబడింది. ఈ కేసులో యువతి దోషిగా తేలింది. కోర్టు ఆమెకు శిక్ష విధించింది. ఇలా డ్రగ్స్ కేసులో ఆ యువతికి శిక్ష పడటం గమనార్హం.