CM Jagan : తెలంగాణలో వైఎస్సార్ టీపీ (వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్) పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల ఎక్కువ రోజులు పార్టీని నడపలేకపోయింది. పార్టీ పెట్టడంతోనే పాదయాత్ర చేసిన ఆమె ఆ యాత్రతో ఎటువంటి ప్రయోజనం కలుగలేదు. ఆ తర్వాత ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అంతా అనుకున్నా.. చివరి నిమిషంలో నో చెప్పింది. దీంతో పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు పార్టీకి రిజైన్ చేశారు. అయితే ఆమెను ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమించాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు ఆమె రేపు (డిసెంబర్ 4) ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై షర్మిల అన్న, సీఎం జగన్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.
మొదట్లో అన్నతో విభేదించిన ఆమె ఏపీని వీడి తెలంగాణకు వెళ్లింది. అక్కడ పార్టీ పెట్టి ఎదుగుదామని అనుకుంది. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఏపీకే రానుంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవి పొందడంపై వైఎస్ జగన్ గతంలో ఎటువంటి కామెంట్ చేయలేదు. కానీ, ఈ రోజు (డిసెంబర్ 3) కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఏమన్నారంటే ‘రాజకీయాల్లో పైచేయి సాధించేందుకు కొందరు ప్రత్యర్థులు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబాలను కూడా విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ‘మీ ఓట్ల కోసం ప్రతి కుటుంబానికి ఒక కేజీ బంగారం, ఇంటికి బెంజ్ కారు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. వారు తమ రాజకీయ అవసరాల కోసం కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు’ అన్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారాన్ని జగన్ ప్రస్తావిస్తున్నారనడానికి ఇది ప్రత్యక్ష సంకేతం.
ఒక్కసారి కాదు రెండు సార్లు ప్రత్యర్థులు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారని జగన్ ఈ సమావేశంలో చాలా సార్లు ప్రస్తావించారు. తనను, తన సోదరి షర్మిలను ప్రత్యర్థులు విచ్ఛిన్నం చేస్తున్నారని జగన్ ప్రస్తావిస్తున్నారనేది ఓపెన్ గానే తెలుస్తుంది. ఈ అంశంపై జగన్ తొలి రియాక్షన్ చాలా ఆసక్తికరంగా ఉంది.