AP : ఏపీలో కొంతకాలంగా ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. జగన్ సర్కారుపై ఉద్యోగులంతా గుర్రుగా ఉన్నారు. అసలు రాజధాని ఏదో కూడా తెలియని రాష్ర్టంలో తామంతా బతుకుతున్నామని పలువురు ఉద్యోగులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు తమ డిమాండ్లు నెరవేర్చడలంలో జగన్ సర్కారు కఠిన వైఖరి అవలంబిస్తు్న్నదని కొంత గుర్రుగా ఉన్నారు. దీనికి మరింత ఆజ్యం పోసేలా జగన్ వైఖరి కొనసాగింది.
అయితే తాజాగా ఎన్నికల సమీపిస్తున్న వేళ జగన్ ఒక్కడుగు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నది. ఒక్కసారిగా ఉద్యోగులపై సాఫ్ట్ మోడ్ లోని జగన్ వచ్చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కంటే తామే ఉద్యోగులకు అండగా నిలిచామంటూ చెప్పుకునే ప్రయత్నం చేశారు. తాజాగా ఉద్యోగులకు ఆయన వరాలు ప్రకటించారు. ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేసిన ఒక సభలో స్వయంగా పాల్గొన్న ఆయన ఈ వరాలు ప్రకటించేశారు. దసరా నుంచి డీఏ బకాయిలు ఇస్తామని ప్రకటించారు. కొత్తగా పీఆర్సీ వేస్తామని తెలిపారు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తెస్తామని ప్రకటించారు. దేశంలోనే మొదటిసారిగా ఏపీలో ఈ మోడల్ తెస్తామని చెప్పారు. మొత్తానికి ఉద్యోగుల కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం వైపు నుంచి శుభవార్త కోసం ఎదురుచూస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ఇదే సభలో పలు వరాలు ప్రకటిస్తూ మరోసారి ఉద్యోగులకు సానుకూల ప్రభుత్వమనే అంశం చెప్పుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు కంటే తానే ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటానని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై కూడా ఆయన చర్చిస్తున్నట్లు చెప్పారు.