Janasena Varahi Yatra : ఈనెల 27 నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించను న్నారు. పొత్తులో సీట్ల పంపకాల పూర్తయిన నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్రలో వారాహి వాహనం మీద పవన్ కళ్యాణ్ ప్రచారం మొదలుపెడతారు. నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న వారాహి వాహనం మంగళగిరి కి రానుంది. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్లి జగన్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించనున్నారు.
గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో నిర్వహించారు. ఎన్నికల్లో పూర్తిస్థాయి పొత్తు తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనంలోకి వెళ్ళనున్నారు. తమ అభ్యర్థులను గెలిపించాలని జనసేన, టీడీపీ, బీజేపి కూటమి అధికారంలోకొస్తే ప్రజలకు ఏం చేయబోతున్నామని విషయాలను తెలుపనున్నారు. అయితే పొత్తు కారణంగా కొంతమంది జనసేన లీడర్లకు సీటు తగ్గలేదు. సీట్లు దక్కని లీడర్లకు పవన్ కళ్యాణ్ ఏ విధంగా భరోసా కల్పిస్తారన్నదా నిపై ఆసక్తి నెలకొంది.