28.5 C
India
Friday, May 3, 2024
More

    Kanimozhi Karunanidhi : దళిత మహిళ వంట తినమన్న విద్యార్థులను.. కనిమొళి ఏం చేశారంటే?

    Date:

    Kanimozhi Karunanidhi
    Kanimozhi Karunanidhi

    Kanimozhi Karunanidhi : విద్యార్థి దశ నుంచే వారి మధ్య తారతమ్యాలుగొప్ప, పేద, వర్గం, కులం, మతం తేడాలు లేకుండా పాఠశాలలు వారికి ఒకే దుస్తులు, ఒకే భోజనం, ఒకేలా చూస్తాయి. వారి మధ్య తేడాలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒక పాఠశాలలో దళిత మహిళ వంట వండిందని పిల్లలు ఆహారం తినేందుకు మొరాయించారు. విషయం తెలుసుకున్న ఎంపీ వారితో కలిసి దళిత మహిళ వండిన భోజనం తిని విద్యార్థులను దగ్గరకు తీసుకొని మంచి విషయాలు చెప్పింది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.

    తమిళనాడు సీఎం ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభించాడు. ఈ పథకానికి సంబంధించి తమిళనాడులోని ఉసిలంపాటి పాఠశాలలో 2 రోజుల క్రితం ఒక ఘటన జరిగింది. ఈ పాఠశాలలో స్వయం సహాయక సంఘం సభ్యురాలు దళిత మహిళ మునియసెల్వి వంట మనిషిగా పని చేస్తోంది. అయితే, విద్యార్థుల తల్లిదండ్రులు ఆమె వండిన వంటను తినవద్దని పిల్లలకు చెప్పారట. అందుకే 20 మంది విద్యార్థులు రోజూ అల్పాహారం తీసుకోవడం లేదు. ఈ విషయం కూడా ఇటీవల అధికారులు స్టాక్ ను పరిశీలించడంతో బయటపడింది. దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి తాను వండిన  అల్పాహారం తింటే గ్రామస్తులు వారిని తరిమికొడతారని పిల్లలు మాట్లాడుకుంటున్న తీరు చూసి బాదేసిందని మునియసెల్వి అధికారుల ఎదుట వాపోయింది. అందుకే వారు అల్పాహారం తీకోవడం లేదని చెప్పింది.

    ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకి అధికార పార్టీ ఎంపీ కనిమొళి చెవిలో పడింది. దీంతో స్పందించిన ఆమె ఉసిలంపాటి ప్రాథమిక పాఠశాలకు వచ్చింది. అదే దళిత వంట మనిషి వండిన అల్పాహారాన్ని స్కూలు పిల్లలతో కలిసి తిన్నారు. దీంతో ఆమెపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ విషయమై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారితో మాట్లాడారు. డీఎంకే ఎంపీ కనిమొళి, రాష్ట్ర మంత్రి గీతాజీవన్, కలెక్టర్ సెంథిల్ రాజ్ పాఠశాలను సందర్శించారు.

    Share post:

    More like this
    Related

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Chhattisgarh News : స్కూల్ టీచర్లు తరిమికొట్టిన విద్యార్థులు.. కారణం ఏంటో తెలుసా..!

    Chhattisgarh News : తనకు చదువు చెప్పాల్సిన టీచర్ పీకుల దాకా మద్యం...

    NRI Yarlagadda : ఇష్టపడి చదివితే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది: ఎన్నారై యార్లగడ్డ

    NRI Yarlagadda : ఇష్టం తో చదివితే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని,...

    Good News : విద్యార్థులకు గుడ్ న్యూస్

        Good news : తెలంగాణ విద్యా శాఖ  వచ్చే  విద్యా...