Vijayashanthi Tweet Viral : నాడు టిఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ మొదటి సెక్రటరీ అయిన నన్ను అప్పుడు ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా పార్టీ నుండి సస్పెండ్ సస్పెండ్ చేసి వెళ్లగొట్టారు అని విజయశాంతి ట్వీట్ చేశారు. ఈరోజు టిఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేశవరావు ఆత్మగౌరవ రీత్యా ఆ పార్టీకి దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయని విజయశాంతి తెలిపారు.
తప్పు లేడ జరిగినయో అందరు ఎందుకు దూరమై తున్నారో కెసిఆర్ గమనించాలని విజయ శాంతి తెలిపారు. కెసిఆర్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసు కోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఒకప్పుడు పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నన్ను ఇలాంటి నోటీసు ఇవ్వకుండా బయటికి గెంటే సారని ఆమె ఆవేదనని వ్యక్తం చేశారు.
ఇప్పుడు పనిచేస్తున్న కేశవరావు కూడా బయటికి వెళ్లే పరిస్థితి వచ్చిందని ఆమె తెలిపారు. పార్టీలో ఏం జరుగుతుందన్నది ప్రతి ఒక్కరు ఇప్పటికైనా గమనించాలన్నారు. నిజాయితీగా పని చేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆమె ఆరోపించారు.