Jagan Dramas : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడి చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. జగన్ కు చిన్న దెబ్బ తాకితే రాష్ట్రానికి ఏదో అయిపోయినట్లు నటిస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. జగన్ ఒక్కడిదే ప్రాణం అన్న చందంగా వైసీపీ ప్రకటనలు చేస్తోంది. దీంతో ప్రతిపక్షాలు కూడా ఘాటుగానే విమర్శలు చేస్తున్నాయి. జగన్ కు ఏం కాలేదు అనవసరంగా ప్రకటనలు చేయొద్దని హితవు చెబుతున్నాయి.
ప్రతిసారి ఎన్నికలకు ముందు ఎవరో ఒకరు చనిపోవడం ఆనవాయితీగా వస్తోంది. వైసీపీ డ్రామాలకు ఎవరో ఒకరు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. వైసీపీ వారు మాత్రం శవ రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ఇక మీ డ్రామాలు ఆపండి. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించండి. ఇంకెన్నాళ్లు మీ ఆగడాలు సాగుతాయి? ఇక పాలనకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చేసిందని అంటున్నారు.
ఓ కుర్రాడిని పెట్రోల్ పోసి తగలబెట్టిన ఉదంతం అలాగే ఉంది. అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఉదంతం గురించి విచారణ ముందుకు సాగడం లేదు. వైఎస్ వివేకా హత్య కేసులో ముద్దాయి అవినాష్ రెడ్డికి మద్దతు ఇవ్వడం ఇలా ఒకటేమిటి జగన్ పాలన మొత్తం అరాచకమే. అన్యాయమే ప్రధానంగా జగన్ పాలన సాగడం విశేషం. దీంతో జగన్ కు టాటా చెప్పాలని ప్రజలు చూస్తున్నారు.
చిన్న చిన్న దెబ్బలకే హడావిడి చేస్తున్నారు. కానీ వైసీపీ నేతల గుండాయిజానికి బలైన వారి పరిస్థితి ఏంటి? జగన్ ఒక్కడిదే ప్రాణమా? జగన్ కు దెబ్బ తాకితే రాష్ర్టం అధోగతి పాలవుతుందా? హత్యలను ప్రోత్సహిస్తున్నదెవరు? బాబాయ్ ని హత్య చేయించిందెవరు? అంటూ టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. జగన్ కు కాలం నిండిపోయింది. ఇక ఆయన ఇంటి బాట పట్టడమే తరువాయి అని చెబుతున్నారు.
జగన్ కు గాయమైతే దానికి కారణం చంద్రబాబు అని నిందిస్తున్నారు. అధికారంలో ఉన్నదెవరు? దాడులు చేయిస్తుందెవరో ప్రజలకు తెలుసని చంద్రబాబు చెబుతున్నారు. జగన్ కావాలనే డ్రామాలు ఆడుతూ ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం అలవాటే. జగన్ పై దాడి చేస్తుంటే సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియడం లేదా? డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.