Vidya Balan : సాధారణంగా ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ తమకు అపోజిట్ వ్యక్తిని చూసినప్పుడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని కానీ చూడగానే ప్రేమలో పడిపోయాను అని కానీ చెబుతుంటారు.. ఎవ్వరు చూడగానే కామం పుట్టింది అని చెప్పరు. కానీ బాలీవుడ్ హాట్ బ్యూటీ మాత్రం తన భర్తను మొదట చూడగానే లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ అని అనిపించింది అని చెప్పుకొచ్చింది.
మరి ఆ భామ ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన విద్యాబాలన్.. ఈమె సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఎన్నో సినిమాలతో హిట్స్ అందుకుని తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.. అలాగే డర్టీ పిక్చర్ సినిమాతో సంచలనం క్రియేట్ చేసింది..
మరి ఎన్నో సినిమాల్లో నటించిన ఈ భామ సినిమాల ద్వారా బాగానే వెనకేసింది. కోట్లు సంపాదించి ప్రస్తుతం లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తుంది.. అయితే విద్యాబాలన్ తాజాగా తన భర్తను చూడగానే ఎలా అనిపించింది అనే విషయం చెప్పుకొచ్చింది. ఈమె నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను 2012లో వివాహం చేసుకుంది.. తాజా ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.
ఈమె మాట్లాడుతూ.. ”మాది లస్ట్ ఎట్ ఫస్ట్ సైట్ అని నేను అనుకుంటున్నాను.. నిజానికి ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పటికీ ముందుగా ఫిజికల్ గానే ఎట్రాక్ట్ అయ్యాం.. ఎందుకంటే తను అందగాడు.. మంచి లుక్స్ తో పాటు నన్ను సెక్యూర్ గా చూసుకునే విధానానికి ఎట్రాక్ట్ అయ్యాను.. నేను మా నాన్నను సిద్ధార్థ్ లో చేసుకుంటాను.. తాను చాలా ప్రైవేట్ పెర్సన్.. పెళ్లి తర్వాత నేను కూడా అలాగే మారిపోయా” అంటూ ఈమె చెప్పుకొచ్చింది. ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి..
ReplyForward
|