Pedakurapadu : పెదకూరపాడు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో భారీగా ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరికలు సాగుతున్నాయి. పెద్దఎత్తున వైసీపీని వీడి టీడీపీలో నేతలు, కార్యకర్తలు చేరుతున్నారు.
ఈరోజు అచ్చంపేట మండల కేంద్రం నుండి వైసీపీని వీడి పెదకూరపాడు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారి సమక్షంలో టిడిపిలో 12 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
అలాగే బెల్లంకొండ మండలం మన్నెసుల్తాన్ పాలెం మరియు రామాంజనేయపురం గ్రామాల నుండి వైసీపీని వీడి పెదకూరపాడు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారి సమక్షంలో టిడిపిలో 20 కుటుంబాలు చేరాయి.
వీరందరికీ కండువా కప్పిన భాష్యం ప్రవీణ్ సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఈసారి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.