Modi’s Lies : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలం అయ్యారని విమర్శలు వస్తున్నాయి. వంద రోజుల్లో నల్లధనం వెనక్కి తీసుకొస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నోట్ల రద్దుతో నల్లధనం అంతు చూస్తామన్నారు. కానీ కుదరలేదు. ఇంకా అవినీతిపరులు పెరిగిపోయారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్నారు. పెట్రో ధరలు రూ. 35కు తీసుకొస్తామన్నారు.
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. రూపాయి విలువ పెరిగేలా చూస్తామన్నారు. కానీ రూపాయి విలువ మరింత దిగజారుతోంది. దీని వల్ల ఆర్థిక మాంద్యం పెరుగుతోంది. 2022 నాటికి 100 స్మార్ట్ సిటీలు నిర్మిస్తామన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని వాగ్దానం చేశారు.
గంగానది ప్రక్షాళనపై హామీ ఇచ్చారు. గంగానదిని ప్రక్షాళన చేసి మురికి రహిత నదిగా తీర్చిదిద్దుతామన్నారు. కానీ అది ఆచరణకు నోచుకోలేదు. 2022 నాటికి గంగానది పూర్తిగా ప్రక్షాళన అవుతుందని భరోసా కల్పించారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అది కూడా ఇంతవరకు ఆచరణలోకి రాకపోవడం గమనార్హం.
చౌకగా సిలిండర్ అందజేస్తామన్నారు. కానీ గ్యాస్ ధరలు తీవ్ర స్థాయిలో పెరిగాయి. రైతుల ఆదాయాన్ని పెంచుతామన్నారు. అవినీతిని అంతం చేస్తామన్నారు. కానీ ప్రస్తుతం అవినీతి కొండలా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఏటా కోటి ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. కానీ దాని ఊసే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మోడీ చెప్పిన అబద్ధాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీనిపై ఏం సమాధానం చెబుతారని అడుగుతున్నారు.