Naga Chaitanya :
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరుంది. ఏఎన్నార్ వారసుడిగా నాగార్జున ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కిందటి తరం నలుగురు టాప్ హీరోల్లో నాగార్జున తన మ్యానరిజంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొని ‘కింగ్ నాగార్జున’ ఫేమస్ అయ్యాడు.
నాగార్జున వారసులుగా నాగ చైతన్య.. అఖిల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘జోష్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఖాతాలో ఏం మాయ చేశావే.. 100% లవ్.. లవ్ స్టోరీ.. బంగార్రాజు వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. ఇక నాగచైతన్య సమంత ప్రేమాయణం.. పెళ్లి.. విడాకుల వ్యవహారం ఎవరూ ఊహించని విధంగా జరిగిపోయాయి.
సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్యకు పెద్దగా హిట్స్ రాలేదు. మరోవైపు సమంత పరిస్థితి కూడా అలానే ఉంది. యశోద.. శాకుంతలం మూవీలు ప్లాప్ కాగా విజయ్ దేవరకొండతో నటించిన ‘ఖుషీ’ మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సమంత మధ్య లిప్ లాక్స్.. రోమాన్స్ సీన్ హద్దులు దాటినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే నాగచైతన్య ‘ఖుషీ’ సినిమా చూడటానికి వెళ్లి మధ్యలోనే లేచి వెళ్లాడనే ప్రచారం జరిగింది. అయితే దీంట్లో వాస్తవం లేదని అభిమానులు చెబుతున్నారు. కాగా విజయ్ దేవరకొండ ఇటీవల బిగ్ బాస్-7 సీజన్లో ‘ఖుషీ’ మూవీ ప్రమోషన్స్ చేశాడు. హోస్ట్ నాగార్జున విజయ్ ను సమంత గురించి అడుగగా ఆమె హెల్త్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లిందని చెప్పాడు.
సమంతను అక్కినేని ఫ్యామిలీ బాగా టార్చర్ చేసిందని.. అందుకే సమంత విడాకులు తీసుకుందని అప్పట్లో సోషల్ మీడియా ప్రచారం జరిగింది. అలాంటిది ఏమిలేదని నాగార్జున వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక విడాకుల తర్వాత నాగ చైతన్య-సమంత ఫ్రెండ్స్ ఉంటారని చూపించడానికి కూడా నాగ్ తెగ ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు.
ఈ క్రమంలో సమంత-విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషీ’ మూవీని అక్కినేని ఫ్యామిలీ మొత్తం చూసేందుకు నాగ్ ప్లాన్ చేశాడట. ‘ఖుషీ’ మూవీని చూసేందుకు నాగ చైతన్యకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా తన తండ్రి నాగార్జున కోసం ఒప్పుకున్నాడట. త్వరలోనే ఫ్యామిలీతో కలిసి నాగ చైతన్య సమంత మూవీని చూడటం ఖాయం కావడంతో అతడిపై జరుగుతున్న ట్రోలింగ్ కు బ్రేక్ పడుతుందో లేదో చూడాల్సిందే..!