Nata Day 3 : డల్లాస్లోని కే బేలీ కన్వెన్షన్ సెంటర్లో నాటా 2023 సభలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడోరోజున తిరుమల శ్రీనివాసుని కళ్యాణంతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ప్రవాస భక్తులు.. నాటా కార్యవర్గ సభ్యులు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు.. ప్రముఖులు మూడోరోజు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
శ్రీవారి కల్యాణోత్సవంలో టీటీడీ ఛైర్మన్ వై.వీ సుబ్బారెడ్డి.. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. భూమన కరుణాకరరెడ్డి.. ఏపీఎన్ఆర్టీఎస్ ఛైర్మన్ వెంకట్.. టీటీడీ ఆగమ పండితులు.. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.