తెలంగాణ సీఎం కేసీఆర్ సరే.. మా సీఎం జగన్ ఏం అడుగుతున్నారో చెప్పండి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తు్న్నారు. అపాయింట్ మెంట్ల కోసం కష్టపడి మా సీఎం జగన్ మిమ్మల్ని కలుస్తున్నారని, ఇంతకు ఏం అడుతున్నారో చెప్పాలని కోరుతున్నారు. తనపై అక్రమాస్తుల కేసు మాఫీ, వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు తగ్గింపు గురించే అడుగుతున్నారా అంటూ ప్రశ్నిస్తు్న్నారు. రాజధాని, పోలవరం తాకట్టు, రాష్ర్ట ప్రయోజనాలు గాలికి.. ఇలా ఎన్నో విషయాలు మీతో చర్చించారా అంటూ అడుగుతున్నారు. మరి ఏపీ సీఎం జగన్ కూడా ఎన్డీఏలో చేరాలని అనుకుంటున్నారా.. లేదా ప్రధాని చెప్పాలని కోరుతున్నారు. మీకు తెలంగాణ సీఎం కేసీఆర్ కంటే ఏపీ సీఎం జగన్ దగ్గరని అనుకుంటున్నామని, కొంత మా రాష్ర్టం గురించి ఏదైనా అడిగారేమోనని తెలుసుకోవాలని అనుకుంటున్నామని వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.
అయితే ఏపీ సీఎం జగన్ మాత్రం నెలకోసారి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వస్తుంటారు. ఇప్పుడైతే ఆయన పై ఉన్న కేసులన్నీ ఆటకెక్కాయి. ఏకంగా పదేళ్లు బెయిల్ పై ఒక నిందితుడు ఉన్నాడంటే మన న్యాయవ్యవస్థను ఎంతలా మేనేజ్ చేస్తున్నారో అర్థం అవుతున్నదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కేంద్ర పెద్దల సహకారం లేనిదే ఇలాంటివి జరగవని, ప్రధాని మోదీకి అంతా తెలుసనని వారు భావిస్తున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ మీ దగ్గర తాకట్టు పెట్టిన రాష్ర్ట ప్రయోజనాలను కూడా ఏపీలో నిర్వహించే బహిరంగ సభల్లో చెప్పాలని కోరుతున్నారు.
ReplyForward
|