గత రెండేళ్లుగా టాలీవుడ్ లో నిత్యం వార్తల్లో నిలుస్తున్న జంట నరేశ్-పవిత్రా లోకేశ్. ఇద్దరినీ ఓ హోటల్ లో పట్టుకుంది నరేశ్ మూడో భార్య రమ్యా రఘుపతి. అప్పటి నుంచి ఆ జంట నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అయితే నరేశ్ రమ్య రఘుపతిని మూడో వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక పవిత్రా లోకేశ్ ఇద్దరిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది. ఈ ఇద్దరు కలిసి పట్టుబడడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఇక చేసేదేం లేక నరేశ్ పవిత్ర కొన్ని రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టిమరీ మేము డేటింగ్ లో ఉన్నాం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2023లో తాము వివాహం చేసుకుంటున్నట్లు ఈ జంట ఇప్పటికే ప్రకటించింది. కానీ రమ్య రఘుపతి మాత్రం నరేశ్ కు విడాకులు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పింది. వీరో ప్రెస్ మీట్.. రమ్య రఘుపతి ఓ ప్రెస్ మీట్ ఇలా సాగుతూనే ఉంది ఈ కథ.
ఇవన్నీ పక్కన ఉంచితే నరేశ్-పవిత్రా లోకేశ్ జంటగా వస్తున్న చిత్రం ‘Malli Pelli’. ఈ మూవీని ఈ నెల (మే) 26న విడుదల చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ చిత్రం నుంచి ఒక అప్ డేట్ ను తీసుకువచ్చారు. ఇందులోని ఒక పాటను చిత్ర యూనిట్ శుక్రవారం (మే 5)న విడుదల చేసింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయ్యింది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా సక్సెస్ పై అంచనాలు పెరిగాయి. వీరి పెళ్లికి అడ్డంకులు ఉన్నా.. సినిమాలో మాత్రం వీరు పెళ్లితో ఒక్కటవుతున్నారు. బయట సంగతి ఎలా ఉన్నా. ఈ సినిమా ఇద్దరి జీవితాలకు చాలా దగ్గరి సంబంధం ఉంటుందని వారే స్వయంగా చెప్పారు. ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించి అప్ డేట్స్ ఇస్తూ వస్తుంది చిత్ర యూనిట్.
‘రారా హోసూరు నాతో’ అంటూ సాగే పాట రిలీజ్ చేయగా, ఇందులో నరేశ్-పవిత్ర యంగ్ సీన్స్, ప్రస్తుతం ఉన్న సీన్స్ తో సాగుతుంది. ఈ సినిమాను మెగా మూవీ మేకర్, డైరెక్టర్ ఎంఎస్ రాజు తెరకెక్కించారు. కుటుంబం అందిరితో కలిసి ఈ సినిమాను చూడొచ్చని దర్శకుడు చెప్తున్నాడు.