Vijay Devarakonda :
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత జంట నటించిన చిత్రం ‘ఖుషీ’. వీరి కాంబినేషన్లో తొలిసారి తెరకెక్కిన ‘ఖుషీ’ సినిమాతొలిరోజు నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకెళుతూ వంద కోట్ల క్లబ్ లోకి చేరేందుకు సిద్ధమవుతుండటంతో ‘ఖుషీ’ టీం తెగ సంబరపడిపోతోంది.
ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఖుషీ సక్సస్ ను అభిమానులతో పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. వైజాగ్ సక్సస్ మీట్ విజయ్ మాట్లాడుతూ.. హిట్ ఇచ్చినా.. ఫ్లాప్ వచ్చినా తనకు అభిమానులు అండగా ఉన్నారని చెప్పాడు. తనకు అండగా నిలిచినందుకు థ్యాంక్స్.. తానున గెలిస్తే ఎంతోమందికి ఆనందం ఉందన్నాడు. ఇక నుంచి మీ కోసం పనిచేస్తానంటూ విజయ్ చెప్పుకొచ్చాడు.
తనపై పరోక్షంగా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో టార్గెట్ చేస్తున్నారని విషయాన్ని సైతం విజయ్ ప్రస్తావించాడు. తనకు అండగా నిలిచి ప్రజల కోసం నిలబడుతానని చెప్పడమే కాకుండా కోటి రూపాయాల సాయం ప్రకటించాడు. వంద మంది నిరుపేద ఫ్యామిలీలకు.. వారి పిల్లల చదువుల కోసం ఒక్కక్కొరికి 1 లక్షల రూపాయలు ఇస్తానని విజయ్ తన ట్వీటర్లో పోస్ట్ చేశాడు.
అయితే విజయ్ దేవరకొండతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా తీసి తాము 6కోట్లు నష్టపోయామంటూ అభిషేక్ పిక్చర్ బ్యానర్ వివాదస్పద ట్వీట్ చేసింది. విజయ్ ప్రజల కోసం కోటి సాయం చేస్తున్నారని అదే సమయంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా తీసుకొని నష్టపోయిన ఎగ్జిబ్యూటర్లు.. డిస్టిబ్యూటర్ల కుటుంబాలను సైతం ఆదుకోవాలని అభిషేక్ పిక్చర్స్ ట్వీటర్లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
అభిషేక్ పిక్చర్ బ్యానర్ పెట్టిన పోస్టుపై విజయ్ దేవరకొండ ట్రెండ్స్ స్పందిస్తూ.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ బిజినెస్ అగ్రిమెంట్ NRA బేసిస్లో జరిగిందని.. ఆ సినిమా లాభానష్టాలకు హీరోకు సంబంధం లేదని పేర్కొంది. ‘అర్జున్ రెడ్డి’ మూవీ సమయంలో వెస్ట్ గోదావరి అభిషేక్ పిక్చర్స్ సినిమా డిస్టిబ్యూషన్ చేసి భారీ లాభాలు తెచ్చుకొన్నారని వాటిని తిరిగి ఇచ్చారంటూ ప్రశ్నించింది. ఈక్రమంలోనే విజయ్ అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా అభిషేక్ పిక్చర్ బ్యానర్ పెట్టిన ట్వీట్ పై కౌంటర్ అటాక్ ఇస్తున్నారు.