NTR31 : ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. కేజీఎఫ్, కేజీఎఫ్-2, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమాను ప్లాన్ చేశాడు. అయితే ప్రస్తుతం యంగ్ టైగర్ కొరటాల శివతో కలిసి ‘దేవర’లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని మొదటి భాగాన్ని 5 ఏప్రిల్, 2024న విడుదల చేస్తామని ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్ తో ఉంటుందని #NTRNeel మేకర్స్ ప్రకటించారు. దేవర పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘#NTR 31’లో ఎన్టీఆర్ భారీ అవతారంలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
‘@tarak9999 అండ్ #PrashanthNeel మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 2024 ఏప్రిల్ లో ప్రారంభమవుతుంది. ప్రతిష్టాత్మక హై ఆక్టేన్ విజువల్స్ ఇండియన్ సినిమాలో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాయి’ అన్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ చిత్రాలతో సమానమైన స్థాయిలో నిర్మించాలని చిత్రబృందం భావిస్తోంది.
ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీఎఫ్, కేజీఎఫ్2 సక్సెస్ తో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ లిస్ట్ లో ఉన్నాడు. ఇక ఆయన తదుపరి సినిమా ‘సలార్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలన్నీ హోంబలే నిర్మాణ సంస్థలో ఆయన చేశారు. ఇప్పుడు యంగ్ టైగర్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ కు ఈ చిత్రం చేస్తున్నాడు. వీరి కాంబోలో వచ్చే సినిమాకు భారీ అంచనాలే ఉంటాయనడంలో సందేహం లేదు.