1000 Car Rally : ఏలూరు జిల్లా ఉంగుటూరు టిడిపి రాజకీయం కాక రేపుతోంది. ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు గాన్ని వీరాంజనేయులు కే ఉంగుటూరు టికెట్ ఇవ్వాలంటూ టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయనకు మద్దతుగా 1000 కార్లతో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి తరలి వెళ్లారు.
పొత్తు లో భాగంగా ఈ సీటు జనసేనకు వెళుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టిడిపి కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున ఉంగుటూరు ఎమ్మెల్యేగా వీరాంజ నేయులు గెలుపొందారు.
ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపి జనసేన పార్టీలు పొత్తు తో ఎన్నికల్లోకి వెళ్తున్నారు. నేపథ్యంలో మళ్లీ మనకు టికెట్ వస్తుందో రాదో అన్న అపు నమ్మకంతో తెలుగుదేశం కేడర్ ఉంది. కచ్చితంగా మా నేతకే టికెట్ ఇవ్వాలని టిడిపి నేతలు ఇలా వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు.