రామ్ చరణ్-ఉపాసన దంపతులు పెళ్లయిన పదేళ్లకు బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ప్రస్తుతం ఉపాసన ప్రగ్నెంట్ ఈ విషయం అందరికీ తెలిసిందే. దీంతో తన భార్యను రామ్ చరణ్ చాలా అపురూపంగా చూసుకుంటున్నారట. ప్రస్తుతం కొనసాగుతున్న షూటింగ్స్ ను పక్కన పెట్టి తన భార్య ఉపాసనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారట.
ఆస్కార్ వేడుకలకు ఆమెను తీసుకెళ్లారు రామ్ చరణ్. దీంతో పాటు పలు దేశాలకు ఉపాసనను తీసుకెళ్తూ ఆనందంగా ఉంచుతున్నారు రామ్. దీనికి తోడు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు వారి వారి నివాసాల్లో బేబీ షవర్ (సీమంతం) వేడుకలు నిర్వహిస్తూ ఉపాసనను సంతోషంగా ఉంచుతున్నారు. జూలైలో ఉపాసన డెలివరీ డేట్ ను కన్ఫామ్ చేశారు వైద్యులు. ఈ నేపథ్యంలో అమ్మాయా.? లేక అబ్బాయా..? అన్న సందేహం మెగా కుటుంబానికే కాకుండా ఫ్యాన్స్ కు కూడా కలుతుగుతుంది. సాధారణంగా అందరూ అబ్బాయి పుట్టాలని కోరుకుంటున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం అమ్మాయే కావాలి అనుకుంటున్నాడట.
తనకు పుట్టబోయేది అమ్మయే అంటూ రామ్ చరణ్ చెప్పడం ఆసక్తిని కలిగించింది. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘3 జూన్ ఆన్ హర్ వే’ (జూన్ 3న ఆమె వస్తుంది) అంటూ చెప్పాడు. అందుకే మెగా ఫ్యామిలీ సీమంతం వేడుకల్లో పింక్ కలర్ నే ఎక్కువగా వాడారు. డెకరేషన్ నుంచి ఉపాసన డ్రెస్ వరకూ అన్నీ పింక్ ఉండేలా చూశారు. పింక్ అంటే అమ్మాయి అని గుర్తు కాబట్టి పుట్టబోయేది కూడా అమ్మాయే అంటూ చర్చించుకుంటున్నారు. ఈ వేడుకకు హాజరైన అల్లు అర్జున్ దంపతులు కూడా సోషల్ మీడియా వేధికగా ఉపాసనకు విషెస్ చెప్పారు. పింక్ కలర్ హార్ట్ ఏమోజీని అల్లు అర్జున్ పోస్ట్ చేస్తూ ‘సో హ్యాపీ ఫర్ మై స్వీటెస్ట్ ఉప్పి’ అంటూ విషెస్ చెప్పాడు.