తెలిసీ తెలియక రాజకీయ బురదలో అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. ట్రోలింగ్ తో పాటు ఆరోపణలు, మాటల యుద్ధాలు పెరగడంతో ఇప్పుడు చింతిస్తున్నారు. ఇక బ్రో సినిమా విషయంలో వైసీపీ అంబటి రాంబాబు చిందులు వేసినా పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించలేదు. కానీ సినిమాలు, రాజకీయాల విషయంలో మాజీ భార్య రేణూ దేశాయ్ స్పందించారు.
‘తననూ తన పిల్లలను రాజకీయంలోకి లాగొద్దు, పవన్ కళ్యాణ్ ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవారు, ప్రజల కోసం కుటుంబాన్ని, తనకు ఇష్టమైన సినిమాలను సైతం వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అందరూ ఆయనను ఆదరించాలి. ఎన్నికల్లో గెలిపించాలి’ అంటూ ఇటీవల ఒక వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. దీనికి అంబటి రాయుడు బదులిచ్చి ఊరుకున్నాడు. పవన్ వీరాభిమానులు, నెగెటివ్ ఫ్యాన్స్ ఆమెపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
ఇక వీటిపై రేణూ దేశాయ్ స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ తాను విడిపోయిన సమయంలో చాలా మంది నిందించారని, ఇప్పుడు కూడా అలాగే నిందిస్తున్నారని చింతిస్తుంది. ‘ఆనాడు మేము ఎందుకు విడిపోయామో చెప్పినప్పుడు నాపైనే విరుచుకుపడ్డారు. పవన్ ప్రతిష్ట దిగజార్చేందుకు ఎవరిదగ్గరో డబ్బు తీసుకొని మాట్లాడానని ఆరోపిస్తూ ధూషించారు. ఇప్పుడు పవన్ మంచివారని మద్దతివ్వాలని కోరినప్పుడు కూడా ఎవరో డబ్బు ఇచ్చి నా చేత అలా మాట్లాడించారంటూ తిడుతున్నారు. రెండు సమయాల్లనూ నేను నిజాలే చెప్పాను. నా మాజీ భర్త పవన్ ఫ్యాన్స్, నెగెటివ్ ఫ్యాన్స్ కు తానే బలైపోతున్నాను. నన్ను ధూషించడం వల్ల మనశ్శాంతి కలుగుతుందంటే అలాగే చేసుకోండి. మీ తిట్లు భరిస్తూ జీవితం గడపాలని రాసుందేమో? కానీయండి’ అంటూ ఇన్ స్టాలో మెసేజ్ పెట్టారు.
సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన తర్వాత పాపులారిటీ ఎంత వస్తుందో టంగ్, ప్రవర్తన స్లిప్ అయితే మాత్రం అంతకంటే ఎక్కువ ట్రోల్స్ వస్తాయి. రేణు దేశాయ్ కి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. అయినా పవన్ కళ్యాణ్ ను సమర్థిస్తూ మెసేజ్ పెట్టడంతో ఇక ట్రోలింగ్ ఎదుర్కోక తప్పలేదు. రాజకీయ బురదలోకి నన్నూ, నా పిల్లలను లాగొద్దని అభ్యర్థిస్తూనే మళ్లీ ఆమె రాజకీయాలు మాట్లాడి బురదలో కాలు పెట్టారు. ఒంటరి పోరాటం చేయగల సత్తా పవన్ కళ్యాణ్ కు ఉంది. కాబట్టి రేణు దేశాయ్ వీలైనంత దూరంగా ఉంటే బాగుంటుంది.