Sheila Mohan : భారతదేశంలో భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి తెలియని వారు ఉండరు. ఏ సబ్జెక్ట్ అయినా, ఏ సెలబస్ అయినా బాల్యం నుంచి పుస్తకాల్లో ఆయన గురించి చదువుకున్న వాళ్లమే. విశ్వేశ్వరయ్య దేశానికి సేవలను అందించారు. అందుకు గానూ భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత బిరుదును అందజేసింది. ఆయన పేరుతో పోస్టల్ శాఖ స్టాంపును కూడా రిలీజ్ చేసింది. ఆయన స్మారకంగానే ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 15న ఇంజినీర్స్ డేగా జరుపుకుంటాం.
ఆయన మనుమరాలు షీలా మోహన్ కూడా తాతకు తగ్గ మనుమరాలిగా గుర్తింపు సంపాదించుకుంటుంది. కాలిఫోర్నియాలోని కుపెర్టినో సిటీ కౌన్సిల్కు షీలా మోహన్ ఎన్నికయ్యారు. కుపెర్టినోలో Apple ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. అక్కడ పనిచేస్తున్న భారతీయులందరూ ఆమెకు ఓటు వేసి గెలిపించారు. షీలా మోహన్ పుట్టింది బెంగుళూలో పుట్టింది. అమెరికాలో స్థిరపడింది. 60,000 జనాభా ఉన్న కుపెర్టినోలో నగరానికి ఆమె ఎన్నికైంది.
ఆమె తన రాజకీయ ప్రస్తానం గురించి మాట్లాడుతూ, వలస వచ్చినప్పటికీ అమెరికన్ల నుంచి చాలా ప్రేమను పొందానని చెప్పింది. ‘ఇది చాలా ఆమోదయోగ్యమైన దేశం, ప్రతి ఒక్కరినీ తమతో కలుపుకుంటుంది. కుపెర్టినో నగరం భారత్ తో పాటు చైనా మరియు జపాన్ నుంచి చాలా మంది వలసదారులను ఆకర్షించింది. మేము కలిసి ఒకే సంఘంగా జీవిస్తున్నాము. నా దారిలో నాకు తోటి కన్నడిగులు ఇరుగుపొరుగువారు ఉన్నారు’. అని ఆమె చెప్పింది.
షీలా ఇంతకుముందు US ప్రభుత్వంతో 30 సంవత్సరాలు పనిచేసింది. USAలోని ఏ నగరంలోనైనా సిటీ కౌన్సిల్ అత్యున్నత విధాన రూపకల్పన సంస్థ. ‘మనం ప్రజలకు అనేక అవకాశాలను అందించాలి. ఆర్థిక పారదర్శకత, ఇతర ప్రాంతీయ ఏజెన్సీలతో భాగస్వామ్యం, అందరికీ స్థిరమైన గృహావకాశాలు కల్పిస్తామని నేను వాగ్దానం చేశాను. నాకు ఐదుగురు మాజీ మేయర్లు, స్థానిక అమెరికన్ల మద్దతు ఉంది.’ అని ఆమె నవ్వుతూ చెప్పింది.