Engineers Day :
దేశ వ్యాప్తంగా ఇంజినీర్స్ డే నిర్వహించుకుంటున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించుకుంటారు. అయితే ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ వారి సేవలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.
ఇంజినీర్స్ డే సందర్భంగా దేశంలోని ఇంజినీర్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వారి సేవలను అభినందించారు. వారి నైపుణ్యం, కష్టపడే తత్వమే దేశ నిర్మాణంలో కీలకంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఇంజినీర్ల ఆలోచనల్లోంచి వచ్చిన మౌలిక అద్భుతాల నుంచి సాంకేతిక పురోగతి వరకు వారి సహకారం ప్రతి ఒక్క భారతీయుల జీవితాల్లో ప్రతి అంశం నిండి ఉంది. ఈ సందర్భంగా దేశాభివృద్ధిలో వారి సేవలు అమోఘం అంటూ కొనియాడారు.
మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక మార్గదర్శక ఇంజినీర్ అని దేశం మొత్తం కొనియాడుతున్నది. కాగా, విశ్వేశ్వరయ్య 1860లో బెంగళూరులోని ఒక గ్రామంలో సెప్టెంబర్ 15న జన్మించాడు. కాగా 1955లో ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అందించి అప్పటి ప్రభుత్వం గౌరవించింది. కింగ్ జార్జ్ చేత నైట్ బిరుదు పొందాడు. దేశంలోని ఇంజినీర్లందరికీ ఆయనోక మార్గదర్శిగా నిలిచారు. ఇంజినీర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు మిన్నంటాయి. ఇదే రోజున ఇంజినీర్స్ డేను భారత్ తో పాటు శ్రీలంక, టాంజానియా కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గౌరవార్థం ఇంజినీర్స్ డే ను జరుపుకుంటారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ప్రముఖులందరూ ఇంజినీర్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దేశాభివృద్ధిలో వారి నైపుణ్యం కీలకమంటూ కొనియాడుతున్నారు.
Greetings to all hardworking engineers on #EngineersDay! Their innovative minds and tireless dedication have been the backbone of our nation’s progress. From infrastructural marvels to tech breakthroughs, their contributions touch every aspect of our lives. pic.twitter.com/lcBeL1GmZQ
— Narendra Modi (@narendramodi) September 15, 2023
ReplyForward
|