ఇక శాఖల వారీగా కేటాయింపులు కూడా పూర్తైనందున ఆయా శాఖలకు సంబంధించిన ఫైల్స్ను కూడా వెంటనే కొత్త భవనంలోకి తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక కొత్త భవనంలో ఒక్కోక అంతస్తుకు మూడు డిపార్ట్మెంట్లను ప్రభుత్వం కేటాయించింది.
కొత్త అందుబాటులోకి వచ్చిన సచివాలయం మొదటి అంతస్తును హోం,రెవెన్యూకు కేటాయించారు. రెండో అంతస్తులో ఆర్థిక శాఖ,మూడో ఫోర్ల్లో ఎస్సీ డెవలప్మెంట్,వ్యవసాయ శాఖకు కేటాయించారు. నాలుగో అంతస్తులో ఇరిగేషన్ అండ్ న్యాయశాఖ,ఐదవ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖ,ఇక 6వ అంతస్తును ముఖ్యమంత్రికి కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే వీటితో పాటు మిగతా శాఖలకు ఏఏ అంతస్తులు కేటాయిస్తారనేది తేలాల్సి ఉంది.