Shraddha Kapoor : ఇటీవల రష్మికా మందన, శ్రద్ధా కపూర్ మధ్య జరిగిన ఒక ఘటన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తీవ్ర చర్చకు దారి తీసింది. శ్రద్ధా కపూర్ రష్మిక విషయంలో వ్యవహరించిన తీరు అస్సలు బాగా లేదని నెటిజట్లు, రష్మిక ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. మరీ అంత ఉండద్దని మందలించారు. దీంతో తేరుకున్న శ్రద్ధా కపూర్ ఇన్ స్టాలో రష్మికను ఫాలో అవడం మొదలు పెట్టింది. ఇది డ్యామేజీ కంట్రోల్ అంటూ నెటిజన్లు, రష్మిక ఫ్యాన్స్ సంబుర పడిపోతున్నారు.
అంబానీ ఫ్యామిలీ గణేశ్ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇండస్ట్రలోని చాలా మంది స్టార్ హీరోయిన్స్ ను పూజకు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చాలా మంది వెళ్లారు. అందులో రష్మిక, శ్రద్ధా కపూర్ కూడా ఉన్నారు.
అంబానీల నివాసంలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో రష్మిక మందన్న తన ఉనికితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే శ్రద్ధా కపూర్ రష్మికను గమనించినట్లు కనిపించినా పట్టించుకోకుండా వెళ్లిపోయిన ఓ వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేసింది. రష్మిక శ్రద్ధా వైపు సాధారణంగానే చూసినా శ్రద్ధా మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో రష్మిక లోలోన బాధపడుతూ బయటకు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఈ వీడియో వేగంగా సోషల్ మీడియా ప్లాట్ ఫారాల్లోకి చేరింది. దీంతో రష్మిక ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. శ్రద్ధా కపూర్ ను ఆడుకున్నారు ఫ్యాన్స్. మరుసటి రోజు రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’ నుంచి రష్మిక మందన్న పోస్టర్ విడుదలైంది.
ఈ సినిమాలోని తన లుక్ ను షేర్ చేసిన శ్రద్ధా కపూర్ రష్మిక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ పై పాజిటివ్ కామెంట్ పెట్టింది. ‘వాట్ ఎ బ్యూటీ!!’ అని శ్రద్ధా ట్వీట్ చేసింది.