కొద్ది రోజులుగా రెజర్లకు అకాడమీ చైర్మన్ కు జరుగుతున్న పోరు రసవత్తరంగా సాగుతోంది. మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీనిపై ఇదివరకే చాలా సార్లు క్రీడాకారులు ఆందోళన చేపట్టినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వారికి ప్రముఖ సినీనటుడు Sonusood స్పందించారు. వారి పోరాటానికి మద్దతు తెలిపారు. కచ్చితంగా వారు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు వారి ఉద్యమం సరైనదేనని ట్వీట్ చేసి వారికి తన సపోర్టు తెలిపారు. ఇలా సోనూసూద్ మద్దతు తెలపడంతో వారు ఉద్యమాన్ని ఇంకా రెట్టింపు చేయాలని చూస్తున్నారు.
మహిళా రెజ్లర్ల ఆరోపణలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా వారు ఎంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమను లైంగికంగా వేధిస్తున్న వారికి ఇలా ప్రభుత్వం వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా తమను బాధలకు గురిచేస్తున్న ప్రభుత్వ తీరును గర్హిస్తున్నారు. సర్కారు తీరు ఆక్షేపణీయంగా ఉందని విచారం వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు పట్టించుకోవడం లేదని అంటున్నారు.
రెజ్లర్ల సమస్యలను పరిష్కరించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. వారికి సరైన రీతిలో న్యాయం చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదో అర్థం కావడం లేదని పేర్కొంటున్నారు. విచారణ కమిటీలు వేస్తూ అందులో ఏం తేలిందనేది కూడా తెలియనివ్వడ లేదు. ఇంత రహస్యం ఎందుకు మెయింటెన్ చేస్తున్నారో తెలియడం లేదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.