Aa Naluguru : మానవత్వం, జీవిత పరమార్థం గురించి వచ్చిన సినిమాల్లో ‘ఆ నలుగురు’ అగ్రస్థానంలో ఉంటుంది. ఇలాంటి సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండదని డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ వెనకుకు పోతారు. కానీ ఈ సినిమా చూపించిన విలువలను మనస్సున్న మనిషి ఎన్నటికీ మరిచిపోలేడు. తనకు ఉన్నంతలో.. తనకు తోచిన విధంగా పొరుగువారికి సాయం చేయాలనే భావనతో తెరకెక్కిన ఈ సినిమా ప్రతీ మనసునూ హత్తుకుంటుంది.
దర్శకుడు చంద్ర సిద్దార్థ్ , హీరో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘ఆ నలుగురు’. ఈ సినిమాపై విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపించారు. ఎలాంటి అంచానాలు లేకుండా కేవలం విలువలను పణంగా పెట్టి తీసిన ఈ మూవీ కూడా భారీ కమర్షియల్ హిట్ ఇచ్చింది. నిజజీవితం లో తరచూ చూసే పాత్రలే ఈ సినిమాలో వెండితెర మీద కనిపిస్తాయి. కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాజేంద్రప్రసాద్ మొదటి సారిగా ‘ఆ నలుగురు’లో ఎమెషనల్ హీరోగా కనిపించారు. ముఖ్యంగా చివరి సీన్స్ అంటే కోట శ్రీనివాస్ రావు డైలాగ్స్ ఎవరూ ఎన్నటికీ మరిచిపోలేరు. మానవత్వపు విలువలతో కూడిన ఈ సినిమా చిరకాలం గుర్తిండిపోతుంది.
ఈ సినిమా కథ నటకిరీటి వద్దకు వెళ్లే ముందు చాలా మంది హీరోల చుట్టూ తిరిగి వచ్చిందట. మొదట సూపర్ స్టార్ కృష్ణతో చేద్దాం అనుకున్నారట, ఈ విషయమై ఆయనని సంప్రదించగా, ఫుల్ లెంగ్త్ రోల్స్ ని చేసేంత శక్తి లేదని సున్నితంగా తిరస్కరించాడట. ఆ తర్వాత విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ను యూనిట్ సంప్రదించిందట. అయితే ఆయనకు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో వదులుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రాన్ని ఒప్పుకొని మంచి క్లాసిక్ మూవీ తెలుగు సినీ పరిశ్రమకు అందించారు.