Rajendra Prasad : గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం కనబడుతోంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
తెనాలి టికెట్ జనసేనకు కేటాయించడంతో గుంటూరు -2, పెనమలూరు స్థానాలపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల గుంటూరు-2 మాధవికి, పెనమలూరు బోడె ప్రసాద్ కు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో అసంతృప్తిలో ఉన్న రాజా సాయంత్రం కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ పై ఒక నిర్ణయాన్ని ప్రకటించరున్నారు.
ఎన్ని రోజులు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నాకు ఇప్పుడు టికెట్ లేకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సన్నిహితుల ద్వా రా సమాచారం అందుతుంది. రెండు చోట్ల టికెట్ ఆశించిన చంద్రబాబు నాయుడు ఒక్కచోట కూడా టికెట్ ఇవ్వకుండా తనను అవమానపరిచారని ఆయన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది.