Arvind Kejriwal : నేను బిజెపిలో చేరితే నాకు ఈడి సమన్లు ఆగిపో తాయని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రవాల్ ట్విట్టర్ లో వ్యాఖ్యా నించారు. ప్రతిపక్ష నేతలను బలవంతంగా చేర్చుకునేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తూ ఉండని ఆయన ఆరోపిం చారు.
బిజెపిలోకి వస్తారా.. లేక జైలుకెళ్తారా అన్నట్ల గా కేంద్ర వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. నాయకులను భయపెట్టి పార్టీలోకి తీసుకొచ్చేం దుకు ఈడి దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాషాయ జెండా కప్పుకుంటామని చెప్పి ఉండి ఉంటే సత్యేంద్ర జైన్, మనీష్ సిసో డియా, సంజయ్ సింగ్ కు రేపే బెయిల్ వస్తుందని కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.
మొత్తం మీద ఢిల్లీ సీఎం కేజ్రవాల్ని కూడా మనీ లాండరింగ్ కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. బిజెపిలో చేరకపోతే ఏ స్థాయి నాయకు డినైనా ఎన్ఫోర్స్ మీ డైరెక్టరేట్ ను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. బిజెపికి రోజుల దగ్గర పడ్డాయని ప్రజలు వారు చేస్తున్న కుట్రలను గమనిస్తున్నారన్నారు.