38 C
India
Friday, April 26, 2024
More

    TDP activists : గోదావరి తీరానికి ఎన్టీఆర్ అభిమానగణం..

    Date:

    TDP activists
    TDP activists, Chandrababu

    TDP activists : అన్న ఎన్టీఆర్ పెట్టిన తెలుగు దేశం పార్టీ తెలుగు రాష్ర్టాల రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచింది. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ముందుకెళ్తున్నది. అయితే రాజమహేంద్రవరంలోని గోదావరి తీరాన రేపటినుంచి తెలుగుదేశం మహాపండుగ నిర్వహణకు సిద్ధమైంది. ఇక్కడే మూడు రోజుల పాటు మహానాడు నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసింది. సుమారు 15 లక్షల మంది పార్టీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నది.

    గోదావరి తీరమే ఎందుకు..?

    ఏపీలో అధికార పీఠం ఎక్కాలంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలే కీలకం.  అందుకే ఇక్కడే మహానాడు ను ఈసారి టీడీపీ ఏర్పాటు చేసింది. ఈనెల 27న పార్టీ ప్రతినిధుల సభ, 28న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ ఈ సభా ప్రాంగణంలోనే మూడు రోజుల పాటు బస్సులో బస చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రెండు తెలుగు రాష్ర్టాల నుంచి సుమారు 15 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే చంద్రబాబు సంతకాలతో కూడిన ఆహ్వాన పత్రికలు ప్రతినిధులకు అందాయి.

    ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల వేళ జరుగుతున్న ఈ మహానాడు కు ప్రాధాన్యత నెలకొంది. పార్టీకి పూర్వవైభవం, వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని జగన్ ధీమాగా ఉన్నారు. ఈ సందర్భంలో జగన్ కు కౌంటర్ గా చంద్రబాబు ఏం మాట్లాడుతారు… ఏం ప్రకటిస్తారోనని అంతా ఉత్కంఠ నెలకొంది.  ఇప్పటికే పొత్తులతోనే వెళ్తామని ప్రకటించిన నేపథ్యంలో మరి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారోనని కూడా అంతా వేచి చూస్తున్నారు.

    పార్టీకి సంబంధించిన తీర్మానాలు, రెండు రాష్ర్టాలకు మేలు చేసేలా కొన్ని నిర్ణయాలు కూడా ఇందులో ఉండనున్నాయి. అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబును మరోసారి ఎన్నుకోనున్నారు, అయితే ఇప్పటికే టీడీపీ చంద్రబాబు రాజమహేంద్రవరం బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. అయితే పార్టీకి కీలకమైన ఈ మహానాడుతో చంద్రబాబు ఎన్నికల సమర శంఖారావం పూరిస్తారని అంతా భావిస్తున్నారు. టీడీపీ శ్రేణులను మరో ఏడాదిలో రానున్న ఎన్నికలకు సమాయత్తం చేసేలా ఈ మహానాడు వేదికగా మారబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సో.. మహానాడు నుంచి జగన్, వైసీపీ పై సమర శంఖారావం తప్పదన్నమాట.

    Share post:

    More like this
    Related

    Chennai : చేపల వలలో కాసులు.. ఎక్కడి నుంచి వచ్చాయంటే?

    Chennai : చేపలు చిక్కుతాయని జాలారి వల వేస్తే వలకు కోట్లు...

    Twins Inter Results : ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ – తిమ్మాపూర్ గురుకుల కళాశాల విద్యార్థుల సత్తా

    Twins Inter Results : ఇంటర్మీడియేట్ ఫలితాల్లో గురుకుల కళాశాల లో...

    BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

    BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP : టిడిపి కార్యకర్తకు ఘోర అవమానం..స్టేషన్ లో  నగ్నంగా తిప్పిన పోలీసులు? 

    TDP : ఏపీ అనంతపురం జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. చంద్రమోహన్...

    Newly Married Couple : గోదావరిలో దూకిన కొత్తజంట.. పెళ్లైన ఐదు రోజులకే..అసలేం జరిగిందో..

    Newly Married Couple : బంధాలు ఎప్పుడు ముడిపడతాయో.. ఎప్పుడు తెగిపోతాయో.....

    TDP Activists Protests : నిరసన తెలిపినా దాడులేనా?

    TDP Activists Protests : ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారం...

    Vijayasai Reddy Comments : విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. మండిపడుతున్న తెలుగు  తమ్ముళ్లు

    Vijayasai Reddy Comments : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం...