TDP Activists Protests :
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. బాబు అరెస్టును అందరు ఖండిస్తున్నారు. మచ్చలేని నాయకుడిని కావాలనే లోపల వేశారని మండిపడుతున్నారు. దీంతో అధికార పార్టీ వైసీపీ నేతలు బాబుకు అనుకూలంగా మాట్లాడుతున్నవారిని టార్గెట్ చేసుకుంటున్నాయి. ఫ్యాక్షన్ దాడుకు తెగబడుతున్నారు. దీంతో ఎవరు కూడా చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడేందుకు జంకుతున్నారు.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బాబుకు మద్దతు పెరుగుతోంది. విదేశాల్లో సైతం బాబుకు అండగా నిలుస్తున్నారు. దురుద్దేశపూర్వకంగా అరెస్టు చేశారని మండిపడుతున్నారు. జగన్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు నశించాయని అంటున్నారు.
రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చెబుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. బాబును విడుదల చేయాలని రిలే నిరాహార దీక్షలకు పూనుకుంటున్నారు. దీంతో ఏపీలో ఏం జరుగుతోంది అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. వైసీపీకి తగిన గుణపాఠం చెప్పక తప్పదని అంటున్నారు.
రాయలసీమ అంటేనే ముఠా కక్షలు. ఇప్పుడు చంద్రబాబుపై కూడా కుట్ర పూరితంగానే జైలుకు పంపారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు. అయినా సరే వైసీపీ నేతలు అడ్డుకునేందుకు చూస్తున్నారు. బలవంతంగా ఒక ప్రతిపక్ష నేతను జైలుకు పంపడం చూస్తుంటే నైతిక విలువలు పతనమయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులు తీర్చుకుంటామని టీడీపీ నేతలు చెబుతున్నారు.