Protect our Health : ఆధునిక కాలంలో మనిషి ఆయుర్దాయం తగ్గుతోంది. దీంతో మనిషి వందేళ్ల జీవిత కాలం ప్రస్తుం అరవై ఏళ్లకు పడిపోవడం విచారకరమే. ఈ నేపథ్యంలో మనకు రోగాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీనికి రకరకాల కారణాలు చెబుతున్నారు. మనిషి ఆయుర్దాయం రోజురోజుకు పడిపోతోంది. చిన్న వయసులోనే రోగాలు మనల్ని దరిచేరుతున్నాయి. పూర్వం రోజుల్లో యాభై ఏళ్లకు కాని బీపీ, షుగర్ లు వచ్చేవి కావు. ఇప్పుడు పాతికేళ్లకే పలకరిస్తున్నాయి. దీంతో మన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది.
దీనిపై జపాన్ శాస్త్రవేత్తలు ఆసక్తికర పరిశోధనలు చేశారు. మనుషుల్లో ముంచుకొస్తున్న వ్యాధుల ముప్పుకు కారణాలేంటో తెలుసుకునేందుకు కొన్ని పరిశోధనలు చేశారు. అందులో తేలిన అంశాలేంటో తెలిస్తే షాకే. ఈ నేపథ్యంలో 50 శాతం ఆధ్యాత్మికత, తాత్విక చింతన లోపం వల్ల, 25 శాతం మానసిక కారణాల వల్ల, 15 శాతం సామాజిక, స్నేహ కుటుంబ బాంధవ్యాల లోపం వల్ల, 10 శాతం శారీరక కారణాల వల్ల అని తేల్చారు. మనిషి జీవితంలో అన్నింటికి ప్రాధాన్యం ఇవ్వకపోతే కూడా అనారోగ్యాలు వేధిస్తాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే స్వార్థం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం, విచారం, హింస వంటివి మన మదిలో మెదలకూడదు. మన మనసు ప్రశాంతంగా ఉంటేనే మనకు మంచి ఆలోచనలు వస్తాయి. అలా మన మనసు ప్రశాంతంగా ఉంటే జీవితంలో దేన్నయినా సాధించవచ్చు. మనసు మందిరంలో మంచి భావాలు లాభాలు తీసుకొస్తాయి.
కారుణ్యం, కృతజ్ణత, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్థం, స్నేహభావం, సేవాభావం, హాస్య ప్రియత్వం, సంతోషం, సానుకూల దృక్పథం లాంటి సానుకూల భావాలు మనకు మంచి చేస్తాయి. మనసు మదిలో మంచి భావాలు ఉంటే మన ఆలోచనలు కూడా పదిలంగా ఉంటాయి. మన ఆరోగ్యం బాగుండాలంటే మంచి భావాలు సాయపడతాయి. ఇలా మన జీవితంలో మంచి పనులు చేయడం వల్ల కూడా ఆరోగ్యం స్థిరంగా ఉంటుందని తెలుసుకుని ఆ దిశగా ముందుకెళ్లడం సురక్షితం.
Source : from UBLOOD & AIMS