Rangareddy News : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో 3 దొంగత నాలు , వేర్వేరు పట్టణాల్లో మొత్తం 23 దొంగత నాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.
శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర నుండి వచ్చి ఇక్కడ పట్టణాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ, అలాగే ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధులపై దాడి చేసి మెడలో బంగారాన్ని దోచుకెళ్తున్న 5 మంది ముఠా లో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
ఇద్దరి నుండి 35 తులాల బంగారం రికవరి చేశారు. మరో ముగ్గురు దొంగల కోసం గాలిస్తు న్నట్లు తెలిపారు. వీరంతా 23 కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. దొంగలను పట్టుకోవడం లో కీలకంగా పని చేసిన పోలీసులకు రివార్డులు అందించారు డీసీపీ నారాయణరెడ్డి.