Mahesh babu : టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు సంపాదించుకుంది మహేశ్ బాబు-నమ్రత. వంశీ సినిమాలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది పెళ్లి వరకు తీసుకెళ్లింది. అప్పుడప్పుడే కెరీర్ ప్రారంభించిన మహేశ్ బాబు లవ్ ట్రాక్ కూడా నడిపించాడు. దీంతో నమ్రత మహేశ్ ఇంటి ఇల్లాలు అయ్యింది. వీరి లవ్ ట్రాక్ లో కొన్ని ఆసక్తికర ఘట్టాలను ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట ప్రస్తుతానికి జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలో చాలా జంటలు కొన్ని రోజులకే విడిపోవడం చూస్తూనే ఉన్నాం.. కానీ మహేశ్ బాబు, నమ్రత విడిపోవడం అటుంచి అలాంటి గాసిప్ లకు కూడా దూరంగాఉంటారు. అందుకే వీరికి ఇండస్ట్రీలో ఆదర్శ జంట అని కూడా గుర్తింపు దక్కింది. ఒక్క సినిమాతో ఏర్పడిన పరిచయం రెండు జీవితాలను ఒక్కటి చేసింది. వీరు లవ్ చేసుకునే సమయంలో సోషల్ మీడియా అంత విస్తృతంగా లేకపోవడంతో వీరి లవ్ ట్రాక్, అందులో ఘట్టాలు, పెళ్లి వరకు విషయాలు పెద్దగా వారి ఫ్యాన్స్ కు, జనాలకు పెద్దగా తెలియవు.
2000 వ వచ్చింది వంశీ సినిమా. షూటింగ్ సమయంలోనే ప్రేమ మొదలైందట. అవుట్ డోర్ ఘూటింగ్ నెల రోజులు సాగింది. ఈ సమయంలోనే మహేశ్ బాబు ప్రపోజ్ చేసేశాడట, నమ్రత కూడా ఒకే చెప్పిందట. ఇక అప్పటి నుంచి పెళ్లి వరకు మధ్యలో పదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. అంత కాలం వీరు ప్రేమించుకుంటూనే ఉన్నారట. 2005, ఫిబ్రవరి 10న మహేశ్-నమ్రత వివాహం జరిగింది.
రీసెంట్ గా ఒక జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ కు వెళ్లింది నమ్రత. తన లవ్ ట్రాక్ లోని కొన్న విషయాలను చెప్పుకచ్చింది. ‘నాకు పెద్దగా నగలు నచ్చవు, చాలా సింఫుల్ గా ఉండేందుకే ఇష్టపడతాను. షాపింగ్ కూడా ఇష్టముండదు. మహేశ్ బాబు నాకు ఇచ్చిన మొదటి బహుమతి వెడ్డింగ్ రింగ్. అది ఎప్పటికీ నాకు ఎవర్ గ్రీన్ గిఫ్ట్’ అని చెప్పింది. అలాగే ‘మా అమ్మ నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు సాయిబాబా బొమ్మ ఉన్న బంగారు ఉంగరం ఇచ్చింది. ఇప్పటికీ నేను దాన్ని పెట్టుకుంటాను. మహేశ్ బాబుతో కలిసి నటిస్తున్నారు.. ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు అని వస్తున్న వార్తల్లో నిజం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.