YSRCP : ఏపి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబానికి వైసీపీ మూడు అసెంబ్లీ టికెట్లు కేటాయించింది. కొండేపిలో ఆదిమూలపు సురేష్ కోడుమూరులో ఆయన తమ్ముడు ఆదిమూలపు సతీష్, మడకశిరలో తిప్పేస్వామి పోటీ చేయనున్నారు. తిప్పేస్వామి మంత్రి సురేష్ కు స్వయానా బావ. మరోవైపు మంత్రి బొత్స సత్యనా రాయణ కుటుంబంలో కూడా మూడు సీట్లను జగన్ కేటాయించారు. బొత్స సత్యనా రాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా ఆయన భార్య ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు. మంత్రి మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు విజయ నగరం ఎంపీగా పోటీ చేస్తున్నారు.
సర్వేల ప్రకారం మార్పులు చేర్పులు చేస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీకి అభ్యర్థులు కరువయ్యా రంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. సిట్టింగ్ లను మార్చడం తో కొత్త అభ్యర్థులు దొరకకపోవడంతోనే ఒకే కుటుంబంలో మూడు సీట్లు కేటాయించి కుటుంబ కథ చిత్రంగా మార్చారని ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తు న్నాయి. ఐ ప్యాక్ సర్వే ప్రకారం వైసీపీ రాష్ట్రంలో అభ్యర్థులను మారుస్తూ వస్తుంది. అయితే కొత్తవారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉన్న మంత్రుల కుటుంబాలలోనే కొంతమందిని లిస్టులోకి చేర్చి ఆ లిస్టును విడుదల వారీగా విడుదల చేయడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అభ్యర్థుల మార్పుతో వైసిపి పతనం ప్రారంభమైందని కచ్చితంగా టిడిపి జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.