ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. అసలు ఈ సినిమాలో ఏం ఉందో తెలుసుకుందాం. కేరళలో వాగమన్ అనే ఊరిలోని పోలీస్ స్టేషన్లో ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకుంటారు. పోలీసులు ఈ ఏర్పాట్లలో ఉండగానే తుపాకీ పేలిన సౌండ్ వస్తుంది. దీంతో వారు అక్కడికి వెళ్లి చూడగా వినోద్ అనే ఓ ఏఎస్ఐ (జోజు జార్జి) చనిపోయి ఉంటాడు. దీంతో హంతకుడిని పట్టుకునేందుకు పోలీస్ స్టేషన్ ను లాక్ చేసి విచారణ మొదలు పెడతారు. వినోద్ చనిపోయిన సంగతి తెలుసుకున్న వినోద్ కవల సోదరుడు అయిన డీఎస్పీ ప్రమోద్ (జోజు జార్జి సెకండ్ రోల్) అక్కడికి చేరుకుంటాడు. ఇంతకీ వినోద్ను హత్య చేసిందెవరు? ప్రమోద్, వినోద్ మధ్య గొడవలున్నాయా ? అసలు మాలిని (అంజలి) ఎవరు? అనేది అసలైన కథ.
ప్రతి రోజూ సమాజంలో మన చుట్టూ జరిగే ఘటనలను బేస్ చేసుకొని అందులో నుంచి ఒక పాయింట్ తీసుకొని దాని చుట్టూ కథను అల్లాడు దర్శకుడు రోహిత్ ఎంజీ కృష్ణ. ఈ చిత్రం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ వినోద్ హతమైన సీన్తోనే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పోలీసుల విచారణ లో ఒక్కొక్కొరు వినోద్తో వారికి గొడవల గురించి చెప్పడం వల్ల వినోద్ హత్య వెనుక కారణాలను ఫ్లాష్బ్యాక్ తో రివీల్ చేయడం అద్భుతంగా ఉంటుంది.
వినోద్ ను హతమార్చింది ప్రమోద్ అని ఊహాగానాలు వస్తుండగా ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుంటాడు డీఎస్పీ ప్రమోద్. ఈ హత్య మిస్టరీని చేధించే సన్నివేశాల చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి జోజు జార్జ్ నటన హైలెట్ గా నిలుస్తుంది. ఇందులో అంజలి పాత్ర కు ఒక్క డైలాగ్ కూడా లేదు. ఈ మూవీ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ఈ చిత్రాన్ని జోజు జార్జి నిర్మించాడు.
ReplyForward
|