America : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో అక్కడ పొలిటికల్ డిబేట్లు కొనసాగుతున్నాయి. ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుఫున పోటీ చేసేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో నేతల మధ్య బహిరంగ చర్చ పెట్టారు. ఈ డిబెట్ ఆద్యంతం వాడీ వేడీగా కొనసాగింది. రిపబ్లికన్ పార్టీ తరుఫున మాజీ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సహా ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ఇందులో 6 బుధవారం (ఆగస్ట్ 23) డిబేట్ లో పాల్గొన్నారు.
ఈ ఆరుగురిలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన నేతలు. అందులో ఒకరు నిక్కీ హీలీ, రెండోవారు రామస్వామి. ఇక ఈ చర్చ ప్రారంభించిన మొదటి గంటలోనే నిక్కీ పేరు మారుమోగింది. ఈ నేపథ్యంలో ఆయనకు అందే విరాళాల మొత్తంలో పెరుగుదల స్పష్టంగా కనిపించిందని వార్తా కథనాలు వెలువడ్డాయి.
ఇది తొలి బహిరంగ చర్చ, ఇందులోనే వివేక్ కు పెరిగిన ప్రజా ఆదరణ విరాళాల రూపంలో స్పష్టంగా కనిపించింది. వివేక్, రామస్వామి ప్రచార బృందం చెప్పిన వివరాల ప్రకారం.. ఈ డిబెట్ ముగిసిన గంటలోపే 4.5 లక్షల డాలర్ల(రూ. 3.7 కోట్ల)ను తమ బృందం విరాళంగా అందుకుందని చెప్పారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్, మరో అభ్యర్థి ట్రంప్ గైర్హాజరీలో రిపబ్లిన్ చర్చలో వివేక్ కీలకంగా నిలిచారని అక్కడ ఒక వార్తా కథనం వెలువడింది. దీంతో అమెరికలో ఇండియన్స్ ప్రతీ విషయంలో తమ సత్తా చాటుతున్నారని అక్కడి ఎన్ఆర్ఐలు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన మహిళ గొప్ప స్థానంలో ఉందని, అలాంటి స్థానాలనే వీరు దక్కించుకుంటారని పలువురు ఆశిస్తున్నారు.